ఎన్నికల పొగతో “కట్టల’ పాములు….!

3.5 crore

తెలంగాణాలో ఎన్నికల పొగ రాజుకోవడంతో “కట్టల” పాములు బయటకు వస్తున్నాయి. భాగ్యనగరం నలు చెరగులా బస్తాల కొద్ది నల్లదనం, అటుపట్టని హవాల సొమ్ము నాట్యం చేస్తోంది. ఎన్నికల నియమావళి వచ్చిందో లేదో ఒక చోటు నుంచి మరో చోటుకు తరలుతున్న డబ్బు మూటలు పోలీసులకు తనిఖిల్లో చిక్కుతున్నాయి. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ గార్డెన్స్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో 6.55లక్షల రూపాయలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో వాహన తనీకీలు చేస్తున్న పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో తరలిస్తున్న 3.35కోట్ల రూపాయల మొత్తాన్ని పట్టుకున్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ చెప్పారు. నిదితులను విచారిస్తే డబ్బు హవాలా వ్యవహారానికి చెందినదిగా తెలుస్తోందని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *