ముందస్తు బెయిల్….

babu 1

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నాయుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవ ద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులోనూ గురువారం వరకు బాబుని అరెస్ట్ చేయవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాునాయుడుకి కొంత ఉపశమనం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *