కప్పు ‘కంగారూ”ల సొంతం…

wc prize

ప్రపంచ కప్పు 2023లో భాగంగా హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కప్పును కైవసం చేసుకుంది.అహ్మదాబాద్ లోని మోడీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చివరి పోరులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో 241 పరుగులు చేసి భారత్ పై గెలుపొందింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 240 పరుగులకే ఆల్ ఔట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు మొదట తడబడినప్పటికీ హెడ్ సెంచరీ (137) , అబూషేన్ హాఫ్ సెంచరీ(58)తో ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. 2003లో ఫైనల్స్ లో తలబడిన టీం ఇండియా, ఆస్ట్రేలియా తిరిగి 20 సంవత్సరాల తరువాత 2023 లో కూడా ఈ రెండు టీంలు ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా 2003లో గెలుచుకున్నట్లే ఈ సారి కూడా భారత్ పై గెలిచి కప్పును ఎగురేసుకుపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *