ఆ మార్గం తప్పు…

judgs

ఎలక్టోరల్ బాండ్స్ స్కీం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేయాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు గోప్యంగా ఉంచటం సరైన పద్ధతి కాదని తెలిపింది. అలాగే ఇది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఒకరకంగా క్విడ్ ప్రోకోకు దారితీస్తాయని తేల్చిచెప్పింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని అభిప్రాయపడింది.

..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *