కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వ తేదీన లోక్ సభ కొలువు దీరనుంది . వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
3.0 తొలిసారి…
