“తిరగబడెను”సామీ…

tarun c

తెలుగు సినీ నటులు హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితంలోను  సమస్యలు ఎదుర్కొంటున్నారు. తరుణ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి పదకుండు ఏళ్లుగా నమ్మిస్తున్నాడని, చివరకు మోసం చేశాడని లావణ్య అనే యువతి హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తరుణ్ తో 11 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నట్ట్టు పేర్కొంది. అంతేకాదు, ఇద్దరు గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. మరో సినీ నటితో సంబంధం పెట్టుకొని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది.  రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని, లేదంటే చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ఆమె  పేర్కొంది.  తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 45 రోజులు జైల్లో ఉన్నానని లావణ్య వాయింది. 

lavnya

మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు చెబుతోంది. ఇదిలా ఉంటె లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా అని తెలుస్తోంది. ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి “తిరగబడరా సామీ” అనే సినిమాలో నటించారు. అయితే, మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య వెల్లడించింది. హిమాచల్‌ ప్రదేశ్‌  ముఖ్యమంత్రి తమ నాన్నకు ఫ్రెండ్‌ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన తరుణ్ గత ఏడేళ్ళుగా లావణ్య తో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. గతంలో ఆమె చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆమె ఎన్ని ఇబ్బందులు పెట్టినా భారించానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *