శివ..శివా…ఎంత డబ్బు…

పవిత్ర పుణ్య క్షేత్రమైన కేదార్ నాథ్ లో ఓ మహిళా భక్తురాలికి నోట్ల పూనకం వచ్చినట్టుంది. బహుశా సంపన్నురాలై ఉంటుందేమో ఏకంగా గర్భ గుడిలో శివలింగం పై నోట్ల వర్షం కురిపించింది. పవిత్రమైన గర్భ గుడిలో నోట్లు వెదజల్లడం వివాదాస్పంగా మారింది. పదకొండవ జ్యోతిర్లింగంలో ఇలా జరగడం అపచారంగా భావిస్తున్నారు. కేదార్ నాథ్ గర్బగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేదం, అయిన, ఆ మహిళ నోట్లు జల్లడమే కాకుండా దాన్ని వీడియో కూడా తీయించుకోవడం పట్ల ఆలయ కమిటి మండిపడుతోంది. లింగం పై నోట్లు జల్లుతున్న వ్యవహారం గుప్పుమనడంతో  ఆలయ కమిటీ ఆ  మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు కేదార్ నాథ్ ఆలయంలో ఉన్న ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకున్నారు. నోట్లు వెదజల్లిన మహిళ ఎవరో తెలియదని అధికారులు చెప్పడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *