సిగ్గుండాలి….
నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, పదవులు, అధికారం అనుభవించి నేడు అదే పార్టీని వీడి పోవడం సిగ్గుచేటు వ్యవహారమని పి.సి.సి. అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై విరుసుకు పడ్డారు.
నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, పదవులు, అధికారం అనుభవించి నేడు అదే పార్టీని వీడి పోవడం సిగ్గుచేటు వ్యవహారమని పి.సి.సి. అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై విరుసుకు పడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకే కాదు, సామాన్య ప్రజలకు సైతం అందరికి తెలిసిన నేత మల్లు భట్టి విక్రమార్క. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ప్రజలకు చేరువయ్యారు. కాంగ్రెస్ నేతలు, లోక్ సభ మాజీ సభ్యులు స్వర్గీయ మల్లు అనంత రాములు, మరో పార్లమెంటు సభ్యుడు మాజీ శాసన సభ మాజీ సభ్యులు మల్లు రవి సొంత తమ్ముడు విక్రమర్క. 1990వ దశకంలో…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.అయన రాజీనామ లేఖను ఎ.ఐ.సి.సి. అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కు పంపినట్టు సమచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు అయన గులాబీ కండువాతో “కారు” ఎక్కే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నో ఆశలతో తెలంగాణ ఆడపడుచు అంటూ రాజకీయ చట్రంలో దిగిన వై.ఎస్.షర్మిల సారథ్యంలోని వై.ఎస్.అర్. తెలంగాణ పార్టీ భవితవ్యం ఎటూ తేలకుండా ఉంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటకగుతున్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తన పార్టీ షరతులను ఢిల్లీ పెద్దల చెవిన వేసి ఈ నెల 30వ తేదీని విలీన వ్యవహారానికి తుది గడువు విధించింది. గతంలో ఆమె పాలేరు సీటుని ఆశించింది. ఖమ్మం జిల్లాలో…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీకి దమ్ముంటే వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాకుండా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూలీగా మారారు. కార్మికుల సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎర్ర రంగు చొక్కా ధరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ లగేజ్ మోస్తూ సందడి చేశారు.
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను…
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.రేవంత్ రెడ్డి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె రేవంత్ తో సమావేశం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.
భారాసా పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన మంత్రి మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సరైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చింది. పరువు నష్టం కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దీంతో రాహుల్ గాంధీకి ఊరట లభించినట్టయింది. దిగువ కోర్టులు అభియోగ పత్రాల సంఖ్య చూశాయే గానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ తరఫున వాదనలు…
ప్రముఖ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారు. ఆమె త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్రెడ్డిని జయసుధ కలవడంతో ఈ ఉహగానలకు తెరలేచింది. ఇద్దరూ సుమారు గంటకు పైగా సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరేందుకు రెండు, మూడు రోజుల్లో న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వీలైనంత ఎక్కువ మంది…