thirupati - EAGLE NEWS
Thumb

అహంకారపు “అడ్డా”..!

ఏంటి “నాయుడు”…! గత ఎన్నికల్లో కుల పిచ్చి, ప్రాంతీయ అహంకారంతో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసినందుకు పట్టుపట్టి మరీ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కించుకొని తిరుమలేశుని దాసుడిగా వేషం వేసుకున్నావు. బుర్రలో అక్షర జ్ఞానం లేకపోయినా, నువ్వెవరో తెలుగు జనానికి ఏ మాత్రం అవగాహన లేక పోయినా “నాయుడు” అనే ఒకేఒక్క “ట్యాగ్ లైన్”  (గాలం) తో వెంటబడి  చంద్రబాబుని వలలో వేసుకున్నావు. సరే, నీవు, నీ చుట్టూ ఉండే…

Read More
IMG 20240629 WA0039

దళారీల నియంత్రణ

శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్ లైన్ సేవలకు ఆధార్ తో లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు అవకాశం ఉందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) అధికారులు, టిసిఎస్, జీయో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇది వరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి…

Read More
IMG 20240624 WA0057

“లక్ష” ప్రయోజనాలు..

తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్ష రూపాయల విరాళం చెల్లించడం వల్ల భక్తులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని టిటిడి అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ వెసులు బాటు ఉన్నప్పటికీ ఆ ప్రయోజనాలను మరోసారి వివరించారు. దేవస్థానానికి విరాళంగా లక్ష రూపాయలు చెల్లించే దాత, అతని,ఆమె కుటుంబ సభ్యులకు సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన సంవత్సరంలో ఒక రోజుకు అద్దె చెల్లింపు ప్రాతిపదికన (5 గురు సభ్యుల వరకు) రూ.100 గది కేటాయించబడుతుంది. కుటుంబ…

Read More
IMG 20230924 WA0003

శ్రీవారి బస్సు చోరీ…

చిన్నా, చితక సామాన్లు ఎత్తుకుపోతే ఏం లాభం అనుకున్నారేమో అందుకే తిరుపతిలో దొంగలు ఏకంగా బస్సునే దొంగిలించారు. అదీ ఏడుకొండల స్వామి దర్శనానికి భక్తులను తీసుకువెళ్ళే తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్సు కావడం గమనార్హం. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్సును చోరీ చేశారు. ఈ ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. చోరీ విషయాన్ని గుర్తించిన వెంటనే జిపిఎస్…

Read More
IMG 20230814 WA0001

ఇక రక్షణ చర్యలు…

తిరుమల వెళ్ళే కాలినడక మార్గంలో పిల్లల పై చిరుత పులుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద…

Read More