NATIONAL - EAGLE NEWS
Screenshot 2023 07 14 143645

ఈ సారి పట్టేస్తా “మామా”…

చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చింది. నిన్న 1.05 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించుకున్న చంద్రయాన్‌-3 ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన మార్క్‌ (ఎల్ వి ఎం 3)ఎం4 వాహక నౌక నింగిలోకి దూసుకుపోయింది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో శాస్త్రవేత్తలు ఈ  ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టారు. ఇస్రో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్‌-2…

Read More
parlamant

ఆ బిల్లు లేదు..

ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 27 బిల్లు ఉభయసభల ముందుకులు రానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా,  మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి వివరించింది. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో చేర్చక పోవడం గమనార్హం.

Read More
run

కంగ్రాట్స్ జ్యోతి…

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో ఆంధ్రప్రదేశ్ కు  చెందిన జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించారు. ఈ పోటిలో బంగారు పతకం సాధించన తొలి భారత అథ్లెట్ గా నిలిచారు.  ఎన్నో ఆశలతో మొదటిసారి ఆసియా అథ్లెటిక్స్  బరిలో దిగిన జ్యోతి  అంతర్జాతీయ వేదిక పై అపురూప ప్రదర్శన చేసింది. 23 ఏళ్ల ఈ విశాఖ స్ప్రింటర్ ఫైనల్ పోటిలో 13.09 సెకన్ల లో సాక్ష్యాన్ని చేధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

Read More
Screenshot 2023 07 14 104336

“రెడ్” సెక్యూరిటి…

దేశ వ్యాప్తంగా టమాటో ల ధరలు చుక్కలను అంటడంతో  వాటికీ విఐపి  భద్రతా కల్పించాల్సిన పరిస్థితి ఎర్పడింది. కొన్ని ప్రాంతాల్లో టమాటో రైతుల పై దాడులు జరగడం, మరోవైపు కొందరు టమాటోలను దొంగిలించడం వంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అధికారులు టమాటోలకు భద్రతకల్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల వ్యాపారులే బౌన్సర్ లను నియమించుకుంటున్నారు. ఆసియాలోనీ రెండో అతిపెద్ద టమాటో మార్కెట్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో ఉంది.  ఇక్కడకు పెద్ద ఎత్తున టమాటాలు రావడంతో  ముందు జాగ్రత్తగా ప్రభుత్వం…

Read More
Screenshot 2023 07 13 091710

నమస్తే.. నా పేరు లీసా..

ఛానల్స్ లో ఇక మరింత సాంకేతిక మార్పు రావచ్చు. ప్రత్యేకంగా అందమైన యాంకర్ల కోసం వెతకడం, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి, వడపోసి ఎంపిక చేయడం లాంటి ప్రక్రియలకు భవిష్యత్తులో తెర పడవచ్చు. తడబాట్లు , బిడియం వంటి తలనొప్పులకు తావులేకుండా బుట్ట బొమ్మల్లాంటి యాంకర్లతో కార్యక్రమాలు చేయించ వచ్చు. ఎలాంటి యాంకర్లు, న్యూస్ రీడర్లు కావాలో ఉహించుకొని అలాంటి వాళ్ళను తెరపై చూపవచ్చు. అందుబాటులోకి వస్తున్నా సాంకేతిక పరిజ్ఞానం ఈ వెసులుబాటును కల్పించనుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్…

Read More
Screenshot 2023 07 12 220255

పోలీసు రక్షణ లోనే…

రాజస్తాన్ గ్యాంగ్ స్టార్ కుల్దిప్ జగినా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకువెళ్తుండగా భారత్ పూర్ వద్ద గల అమోలి టోల్ ప్లాజా వద్ద కుల్దిప్ ప్రత్యర్ధి ముఠాకు చెందిన వారు కాల్చి చంపినట్టు రాజస్తాన్ డిజిపి ఉమేష్ మిశ్రా చెప్పారు. సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టినట్టు తెలిపారు. పోలీసు వాహనంలోనే అంత బందోబస్తు మధ్య కుల్దిప్ ను హతమార్చడం పై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Read More
bindi

బొట్టు పెట్టుకుంటావా…

ఝార్ఖండ్ లోని సెయింట్ జేవియర్ స్కూలులో నుదిటి పై బొట్టుపెట్టుకొని వెళ్ళిన ఓ విద్యార్ధినిని టీచర్ చంప దెబ్బలు కొట్టడం తో అవమానభారం భరించ లేక ఆ విద్యార్ధిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు, పోలీసులు పాపను ఆసుపత్రికి తరలించారు.  

Read More
gst 1

వసూళ్ళు ఎలా…

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక,వైద్య శాఖ మంత్రి టి.హారీష్ రావు.

Read More
Screenshot 2023 07 11 133536

నిర్లక్ష్యం…

ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న కారుని డి కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.అయితే, బస్సులో పిల్లలు లేకపోవడం గమనార్హం.

Read More
Screenshot 2023 07 11 111758

ఉగ్రం…

హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సోలాన్ ప్రాంతంలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 50 ఏళ్లలో ఒకరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని పేర్కొన్నారు.  బియాస్ నది ఉప్పొంగడంతో వరద ధాటికి  ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ భారీ వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. జాతీయ విపత్తు నివారణ బలగాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంత ప్రజలకు సహకరిస్తున్నాయి.

Read More

నదిలో బస్సు…

ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ప్రజాజీవన అతలాకుతలం అవుతోంది. వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రవాణా స్తంభించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రామ్ఢ్ గ్రామంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని దాటించేందుకు ప్రయత్నించగా వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు కిటికీల్లోంచి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగక పోవడంతో ఉపిరి…

Read More

బియాస్ భయం…

హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది తీరాన మరో ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వరద రావడంతో నది ఒడ్డున ఉన్న దుకాణాలు కొట్టుకుపోయాయి.

Read More
Screenshot 2023 07 08 185100

మీ సహకారం గొప్పది…

దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం గొప్పదని, దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా  రూపు దిద్దుకోవడంలో తెలంగాణ ప్రజలదే కీలకపాత్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  అన్నారు.  కాజీపేటలో రైల్వే మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు రూ. 6100 కోట్ల విలువైన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా  తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు…

Read More