అలా జరిగింది…

Screenshot 20230814 121737 WhatsApp 1

సరదా కోసం సముద్రంలోకి వెళ్లి మునిగిపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లాకి చెందిన పుల్లేటి మహేష్, గోగుల రమణ తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి సముద్రంలోకి వెళ్ళి పోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి కానిస్టేబుల్ గణేష్, ఎం. వెంకటేశ్వర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి వెళ్లి వాళ్ళను ఒడ్డుకు చేర్చారు. పోలీసుల సమయ స్ఫూర్తిని పలువురు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *