పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
అప్పట్లో ప్రధాని మోడీ అన్నట్లుగానే చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు మింగారని ఆరోపించారు. బాబు సహా అయన ముఠా మొత్తానికి ఈ కుంభకోణంలో ఉందన్నారు. సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతి పనిలోనూ చంద్రబాబు అనుచరులు లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించి ఎల్ అండ్ టి, షాపూర్ జి సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి వారి నుంచి రూ. 118 కోట్లు ముడుపులు మింగిన అంశం మీద చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు.. అంత భారీ మొత్తంలో కమిషన్ రూపంలో డబ్బులు మింగేసిన చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికారని, దీనికి అయన ప్రజలకు ఏమి సమాధానం చెబుతారో చూడాలని సజ్జల అన్నారు.
పోలవరం”బాబు”ఏ.టీ.ఎం…
