పీఆర్సీ పరిధిలోకి…

IMG 20231001 WA0008

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంగన్ వాడీ టీచర్ల పై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వేతన సవరణలో అంగన్ వాడీ టీచర్లను చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్ ల నేతలు హరీష్ రావు ని కలిశారు. అంగన్ వాడీల సమ్మె పై నాయకులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ చర్చలు జరిపారు. వారి డిమాండ్ల పై సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీ లో అంగన్ వాడీలను చేర్చుతామని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరి జీతాలను కూడా పెంచుతామని అన్నారు.ఇతర డిమాండ్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంగన్ వాడీ సెంటర్ల లో మధ్యాహ్న భోజన పథకం కింద పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని ఒకటి, రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు కూడా మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది అంగన్ వాడీ ఉద్యోగులకు లాభం చేకురుతుందని హరీష్ రావు చెప్పారు. అంగన్ వాడిల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని వారి సమస్యలను పరిష్కరిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.గతంలో ఏ ప్రభుత్వాలు అంగన్ వాడీల గురించి పట్టించుకోలేదని, అంగన్ వాడీ వర్కర్లుగా ఉన్న వారి పేరును గౌరవప్రదంగా ఉండేలా అంగాన్ వాడీ టిచ్చర్లుగా మార్చిన ఘ నత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని యూనియన్ నాయకులు గుర్తు చేశారు. ఈ చర్చల్లో సిఐటియు, ఏఐటియుసి యూనియన్ నాయకులు అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చర్చలు సఫలం కావడంతో కొద్ది రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు కార్మిక సంఘం నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *