భారాసలోకి బాల కిషన్ …

balakishn

కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం
ఉపసంహరించుకున్న బాలకిషన్ యాదవ్ పట్నం మహేందర్ రెడ్డి అధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.కేటీఆర్ బాలకిషన్ యాదవ్ కు గులాబి కందువ కప్పి స్వాగతం పలికారు. దుద్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కొడంగల్ ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, అయితే సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి కొడంగల్ లో ప్రజల కోసం ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కి మద్దతు ఇవ్వడానికి తన నామినేషన్ ఉపసంహరించుకొని బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *