తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం పంపారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నాను,కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారని, నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని సోనియా పేర్కొన్నారు.
తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నట్టు, దొరల తెలంగాణ ప్రజల తెలంగాణగా మారాలని ఆశిస్తున్నట్టు, తెలంగాణ ప్రజల కలలు సహకారం అవ్వాలని కోరుకుంటున్నట్టు సోనియా తెలిపారు. సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారని, మీకు మంచి ప్రభుత్వం లభించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె సందేహంలో పేర్కొన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయండి, మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ తెలంగాణ సోదరులు ,అమ్మలు , బిడ్డలకు ఇదే నా విన్నపం అంటూ సోనియా సందేశాన్ని ముగించారు. మీ ప్రేమ ,అభిమానాలకు నేను ఎప్పటికి రుణపడి ఉంటానని కొసమెరుపు ఇచ్చారు.