ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరాడానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆయన మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎం.సి.హెచ్.ఆర్.డి.)ని సందర్శించారు అక్కడి ఫ్యాకల్టీ తో సమావేశం అయ్యారు. అయ్యారు. ఎం.సి.హెచ్.ఆర్.డి. కార్యకలాపాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సంస్థ లోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి చూశారు. ఎం.సి.హెచ్.ఆర్.డి. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయల్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సంస్థ కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రేవంత్ తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభిృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి అనసూయ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాకారానికి సమాయత్తం …
