అమ్మా “గూడెం”..!

IMG 20240621 WA0041

మైనింగ్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీ లాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ ఏక కాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే. సోదాలు పూర్తి కావడంతో ఈడీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రూ. 300 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. ప్రభుత్వానికి రూ. 39 కోట్లు నష్టం చేకూర్చారు. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీ లను గుర్తించాం. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్‌ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. సోదాల్లో రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. బినామీల పేర్లతో లావాదేవీ లను గుర్తించాం. కొన్ని బ్యాంక్ లాకర్స్‌ని ఇంకా తెరవాల్సి ఉంది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్‌ రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారని ఈడీ ప్రకటనలో వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *