మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికార పరిణామం కనిపించింది. ఒకే కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు లోక్ సభకు ఎంపిక అయ్యారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అఖిలేష్ యాదవ్ కుటుంబం నుంచి ఐదుగురు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావడం విశేషం. వీరు ఎంపీలుగా ప్రమాణం చేశారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్పురి నుంచి గెలిచారు. అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ధర్మేంద్రయాదవ్ అజంగఢ్ నుంచి, అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి, ఆదిత్యయాదవ్ బదౌన్ నుంచి విజయం సాధించారు. ఒకే కుటుంబం నుంచి ఐదుగురు ఒకే పార్టీ నుంచి గెలవడం ఉత్తర ప్రదేశ్ లోనే కాదు, పార్లమెంట్ లాబీల్లోనూ చర్చగా మారింది.