కొన్ని దేశాల్లో మళ్ళీ వైరస్ విస్తరిస్తోంది. నాలుగేళ్ల పాటు సుప్తావస్థలో ఉన్న వైరస్ లు తిరిగి చలన స్థితికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. హాంకాంగ్, సింగపూర్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్తో పాటు అడినోవైరస్, రైనో వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హాంకాంగ్లో ఏడాది వయస్సు దాటిన చిన్నారులకు వైరస్ సోకుతోంది. ఈనెల 3వ తేదీన తొలి కేసు నిర్ధారణ కాగా,వారం రోజుల్లోనే వేల సంఖ్యకు చేరాయి. ఒక్క సింగపూర్ లోనే వారం వ్యవధిలో 14,200 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ రెండు దేశాల్లో వైరస్ కేసులు నమోదు కావడంతో విమానయాన శాఖలు అప్రమత్తం అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వివరాలు సేకరిస్తోంది.
మళ్లీ “కరోనా”…!
