amrpali 1

అథారిటీ లో “ఆమ్రపాలి”..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)పరిధిలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కినట్టు భావిస్తున్నానని ఐ.ఎ.ఎస్ అధికారి ఆమ్రపాలి అన్నారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, హెచ్ఎండిఏ ఉద్యోగులు,సిబ్బంది సహకారంతో మరిన్ని జంట నగరాల్లో మరిన్ని అభివృద్ధి ప్రణాళికలు చేపట్టనున్నట్టు తెలిపారు. హెచ్ఎండిఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్…

Read More
gvrnr podiam

ఇనుప కంచె తొలగింది…!

పదేళ్ల నిర్బంధ పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల విజ్ఞతను అభినందించార. ఈ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చా వాయువులను పీల్చుకుంటోండని. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఉభయ సభల నుద్దేశించి ఆమె ప్రసంగించారు. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన…

Read More
jnj

ఎన్నుకోలేదు..దిగిపోండి..!

హైదరాబాద్ లోని జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యం వల్ల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు మళ్లీ పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాక, ప్రస్తుతం సొసైటీకి బాధ్యత వహిస్తున్న మేనేజింగ్ కమిటీ పై కూడా మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న కమిటీలోని వారు వెంటనే తప్పుకోవాలనే బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికె కొందరు రాజీనామా చేసినట్టు సమాచారం అందుతున్నప్పటికీ మేనేజింగ్ కమిటీ మొత్తం…

Read More
Screenshot 20231214 171406 WhatsApp

Medicos Assaulted..

Five students from Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS)-Adilabad, Telangana were allegedly assaulted by unknown persons who barged into the campus here on Wednesday night. Police said the MBBS students sustained minor injuries when the unidentified persons attacked them. Another student Abhishek from MBBS final year was reportedly dragged till the main gate when…

Read More
speakr

కొత్త స్పీకర్-కొత్త మంత్రులు…

తెలంగాణ శాసన సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ,నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ ని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఐటి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సమాచార,గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంబేద్కర్ సచివాలయంలో భాద్యతలు…

Read More
batti swrn

“భట్టి”బాధ్యతలు…

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు.అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు…

Read More
gas parlmnt

సభలో “ఉగ్ర గురి”…

ముష్కర మూకలు మరోసారి దేశ లోక్ సభకు గురిపెత్తాయి. సరిగ్గా 22 సంవత్సరాల కిందట పార్లమెంట్ భవనం వద్ద కాల్పులకు తెగబడ్డ తరహా లోనే ఈ సారి దుండగులు ఏకంగా పార్లమెంట్ సభలో కూర్చున్న సభ్యుల పైకి దూసుకు వెళ్ళారు. ఇద్దరు ఆగంతకులు ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకి టియర్ గ్యాస్ విడుదల చేశారు. దీంతో భద్రతా దళాలు ఆ ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నాయి. వీళ్ళను ఖలిస్తానీ వేర్పాటవాదులుగా భావిస్తున్నారు. 2001 వ సంవత్సరంలో ఇదే…

Read More
beltshop

ఇక”బెల్టు”తెంచుడే..!

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా పుట్టుకొచ్చిన ”బెల్టు షాపు”లు మూత పడనున్నాయి. రోడ్లు, జనావాస ప్రాంతాల్లోని రోడ్ల పక్కనే వెలిసిన వేలాది బెల్టు దుకాణాలను మూయించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నడుం బిగిస్తోంది.దాదాపు అన్ని చోట్లా జిల్లా నాయకులూ, గల్లీ లీడర్ల కనుసన్నలలో బినామీ చిట్టాల కింద నడుస్తున్న వైన్ షాపులకు అనుకొనే అధిక సంపాదన కోసం “బెల్టు”లు చుట్టారు. వైన్ దుకాణంలో మందు కొన్నుక్కొని పక్కనే…

Read More
cm ngos

ఆర్ఆర్ తో “భజన”బృందం..!

గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోకుండా “ఒంటెద్దు పోకడ” ప్రభుత్వానికి వత్తాసు పలికిన తెలంగాణ ఎన్జీవో సంఘ భాజన” బృందం ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. గత పదేళ్లుగా పదవులు, ప్రమోషన్లను అడ్డుపెట్టుకొని సచివాలయం, ప్రగతి భవన్ లను అడ్డాలుగా చేసుకొని ఉద్యోగుల బాగోగులను తుంగలో తోక్కిన్ ఈ బృందం తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కలిసింది. ఉద్యోగుల కుటుంబాలను విడదీసిన 37౦ మల్టీ జోన్ల జీ.ఓ. విషయంలో, సగం నెల గడిచినా జీతాలు…

Read More
city cps

కొత్త “సింహాలు”…

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మొదట జంట నగరాలకు ఉక్కు కవచాలను నియమించింది. హైదరాబాద్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించింది. అదేవిధంగా సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సిపి గా సుధీర్ బాబుని నియమించారు.ఇప్పటి వరకు నగర కమిషనర్ గా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.

Read More
jagana review

ఇటీవల తుపాను కారణంగా దెబ్బతిన పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌ సమీక్షసమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై చర్చించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలన సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని స్పష్టంచేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని,…

Read More
jana revnt

“జానా”ఇంటికి రేవంత్ …

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్ లోని జానారెడ్డి నివాసానికి వెళ్ళిన రేవంత్ రెడ్డికి జానారెడ్డి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

Read More
alla

“ఆళ్ళ”రాజీనామా …!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆళ్ళ అసంతృప్తితో ఉన్నారు. అలాగే రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల…

Read More
allam

బెల్లం కొట్టిన రాయి“అల్లం”…!

పాత్రికేయ రంగంలో విలువలను పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటైన తెలంగాణ  ప్రెస్ అకాడమీ (ప్రస్తుత మీడియా అకాడమీ) గత పదేళ్లుగా పాలకుల మడుగులోత్తే అడ్డాగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. జర్నలిజాన్ని, పాత్రికేయులను ప్రోత్సహిస్తూ కమ్యూనికేషన్, మీడియా ద్వారా సమాజానికి సహాయపడే విధంగా పనిచేయాల్సిన అకాడమీ దశాబ్ద కాలంగా నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరించిందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విలువలతో పని చేసిన ప్రెస్ అకాడమీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తన ప్రాభవం…

Read More
cm mhrd

సాకారానికి సమాయత్తం …

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరాడానికి  అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం పై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆయన మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎం.సి.హెచ్.ఆర్.డి.)ని సందర్శించారు అక్కడి ఫ్యాకల్టీ తో సమావేశం అయ్యారు. అయ్యారు. ఎం.సి.హెచ్.ఆర్.డి. కార్యకలాపాల  గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సంస్థ లోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి చూశారు. ఎం.సి.హెచ్.ఆర్.డి. డైరెక్టర్ జనరల్…

Read More