Good News For ‘Eagles”
Eagle News is now available in Multilingual Text i.e. English and Telugu for easy access.
Eagle News is now available in Multilingual Text i.e. English and Telugu for easy access.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గా సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ హైదరాబాద్ లోని ఒక శరణాలయంలో నిర్వహించారు. బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. అనాను హోమ్ నిర్వాహకులు సత్కరించారు.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలంటే కష్ట పడడం ఒక్కటే మార్గమన్నారు. ఇందులో భాగంగా బాధ్యత గల ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు సైతం రోజుకు 18 గంటల పాటు పనిచేయాలని కోరారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో రేవంత్ మాట్లాడారు. సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా దాన్ని క్షేత్రస్థాయిలో అమలు…
ఆమె పేరు టేలర్ స్విఫ్ట్. వ్యవసాయ ఆధారిత కుటుంబంలో నుంచి వచ్చింది. బాల్యం మొత్తం పంటపొలాల మధ్యనే సాగింది. కానీ ఎందుకో ఆమె మనసు సంగీతం వైపు మళ్ళింది. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే అందులోకి అడుగు పెట్టింది. రెండేళ్ళ పాటు ఎంత ప్రయత్నించినా మ్యూజికల్ థియేటర్ లో స్థానం దొరకలేదు. అయినా పట్టు సడలలేదు. లక్ష్యం ఒక్కటే అమెను ముందుకు తెసుకుపోయింది. దేశీయ సంగీతంపై దృష్టి పెట్టి 14 ఏళ్ల ప్రాయంలోనే రచయితగా మారి సత్తా చాటింది. ఈ…
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 4 నెలల క్రితం స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు…
రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయబడిన వి.ఆర్.ఎ.లు , వి.ఆర్.ఓలు, ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా వారి వెంట ఉండి కృషి చేస్తానని ప్రొ. కోదండరామ్ హామీ ఇచ్చారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సదస్సు తూంకుంట లో జరిగింది. రెవెన్యూ శాఖ పునర్వైభవం కోసం, రైతుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది ముగిసింది. ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం హకీంపేట్లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు పలికారు. ఆమె ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. “బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు…
French President Emmanuel Macron is set to be the chief guest at the Republic Day celebrations on January 26 next year, news agency PTI reported on Friday, citing people familiar with the development. The Indian government had invited US President Joe Biden as the chief guest, but he expressed his inability to visit New Delhi…
ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విభాగాల్లో ఆరోగ్య శాఖ ఒకటి. అంతటి ప్రాధాన్యం ఉన్న శాఖకు దశాబ్ద కాలంగా పట్టిన “వైరస్”వదిలిందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ శాఖలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఒక అధికారి గత అధికార పార్టీ జెండాను భుజాన వేసుకోవలనే ఆత్రుతతో “దొర” కాళ్ళు పట్టి మరీ తిరగడం, వైద్య కళాశాలల్లో విద్యా బుద్ధులు చెప్పే వారికి దిశానిర్దేశం చేయాల్సిన మరో అధికారి “ఒంటెద్దు” ప్రభుత్వం తనదే అన్నట్టు వ్యవహరించడంతో వైద్య రంగం,…