
ప్రియాంకతో రేవంత్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు.
ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఎన్ని హామీలైనా గుప్పించవచ్చు. ప్రత్యర్థి పార్టీ పై రాజకీయ విమర్శలూ చేయొచ్చు. కొన్నేళ్ల కిందట వరకు ఎన్నికల తెరపై ఇదే తంతు కనిపించేది. రానురానూ అది కాస్తా వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళింది. దశాబ్ద కాలంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజా సమస్యల ముచ్చట పక్కనపెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సర్వ సాధారణమైంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీనీ, దాని నాయకులను ఓడిన నేతలు శత్రువులుగా చూడడం పరిపాటైంది. అధికార…
బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
హైదరాబాద్ పాత బస్తీకి మెట్రో రైల్ పరుగు పెట్టనుంది. అఫ్జల్ గంజ్ ఎంబీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 2వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెట్రో పనులు చేపడుతున్నారు. దీంతో పాత నగరం ప్రజలకు మెట్రో అందుబాటులోకి రానుంది. శంకుస్థాపన కార్యక్రమంలో ఎం.ఐ.ఎం. నేత, ఎం.పీ అససుద్దిన్ ఓవైసీ సహా పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు…
హైదరాబాద్ చుట్టూ నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది. ఏయే సంస్థలున్నాయి, ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి…
ప్రభుత్వాన్నికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. ‘‘కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత…
విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా…
I am elected as the chief minister of Telangana State because the people of this area extended support whole-heartedly. I am extending my gratitude to the people of Kodangal Assembly constituency, said Chief Minister Revanth Reddy in in a public meeting held at Kosgi. KCR had won from this area but there was no voice…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు.
మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, వీలైనంత తొందరగా మూసీ నది శుద్ధి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి, సరైన…
బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానిచానున్నట్టు రేవంత్ తెలిపారు.
తెలంగాణ ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని నల్లగొండలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుందన్నారు. నన్ను చంపుతారా అని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందని చచ్చిన పామును ఎవరైనా చంపుతారా అని ప్రశ్నించారు. సూటిగా సవాల్ విసురుతున్నా“పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్” అంటూ కెసిఆర్ పై…
తెలంగాణ శాసన సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి (భారాస) నేతల్లో అసహనం పరాకాష్టకు చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆవేశంలో యువ నేతలు గత చరిత్రను మరచిపోతున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రజల కోసమో లేక అధికారం లేదనే కోపమో తెలియదు గానీ కొద్ది రోజులుగా కెటిఆర్, కవిత, సుమన్, శ్రీహరి వంటి భారాస నేతలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తున్న తీరు అంతుపట్టకుండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారాస…