rajani

గవర్నర్ “రజినీ”…?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను గవర్నర్ పదవి వరించనున్నట్టు సమాచారం అందుతోంది. కొద్ది రోజులుగా రజిని చేస్తున్న,పర్యటనలు దీనికి ఉతమిస్తున్నాయి. ఇటీవల అయన యూపీ సీఎం యోగి, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో భేటీ కావడం రాజకీయ పరిశీలకులను ఆలోచనలలో పడేసింది. రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లోనే గవర్నర్ పదవిఇవ్వనుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని అయన సోదరుడు సత్యనారాయణ వద్ద ప్రస్తావిస్తే ఏ పదవిపై ఆశలు…

Read Full News
Screenshot 20230903 173609 Gallery

“గిన్నిస్”కెక్కిన సవ్వడి..

కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా 7000 మంది కళాకారులతో నిర్వహించిన నృత్య కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నృత్యం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించడం విశేషం.

Read Full News
c147d11e26e44076a9474f9090c3e24c

“కేసరి” తీన్మార్…

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “భగవంత్ కేసరి” ఈ నెల 19న వెండితెర పై గర్జించదానికి సన్నద్ధం అవుతోంది. ఈ సినిమాలో నటి శ్రీలీలతో కలిసి బాలయ్య తీన్మార్ చేశారు.

Read Full News
IMG 20230902 WA0003

ఆ పనికి మసాజ్ ముసుగు…

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని స్పాలు, మసాజ్ సెంటర్ల పై యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ బృందాలు మెరుపు దాడులకు దిగాయి. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది..శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు…

Read Full News
digvijay

రైతే రాజైతే…

హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రైతే రాజైతే వ్యవసాయం పండగే అనే పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ విష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Read Full News
sajjal

పోలవరం”బాబు”ఏ.టీ.ఎం…

పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.అప్పట్లో ప్రధాని మోడీ అన్నట్లుగానే చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు మింగారని ఆరోపించారు. బాబు సహా అయన ముఠా మొత్తానికి ఈ కుంభకోణంలో ఉందన్నారు. సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతి పనిలోనూ చంద్రబాబు అనుచరులు లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించి ఎల్ అండ్ టి, షాపూర్ జి సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి…

Read Full News
adhitya

అగ్ని గోళం వైపు..

రోదసీలో అత్యంత క్లిష్టమైన చంద్రయాన్ -3 ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తాజాగా సూర్యునిపై పరిశోధనల కోసం నడుం బిగించింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్ డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వి-సి 57 రాకెట్ ఆధిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల…

Read Full News
ys c

జ్ఞాపకాలు..

దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన స్మారకం వద్ద పలువురు నివాళులు అర్పించారు. ఆయన సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల స్మారకం వద్ద ప్రార్ధనలు జరిపారు.

Read Full News
tenneti vanitha

అంతా మీ కోసమే…

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మహిళల  సాధికారతకు పెద్ద పీట వేయడం జరిగిందని, 90 శాతం పైగా పథకాలను మహిళల పేరుతోనే అందించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మహిళలు  సంక్షేమం పథకాలను తెలుసుకొని సామాజికంగా, ఆర్థికంగా లబ్ది పొందాలని ఆకాంక్షించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్తోన్నారు. ప్రతి ఇంటికి  ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని…

Read Full News
cheetha

ఐదో చిరుత…

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచరిస్తోంది. ఈ విషయం గుప్పుమనడం శ్రీవారి భక్తులు భయందోలనకు గురిచేస్తోంది. కాలిబాటలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు చిరుత‌ల‌ను ప‌ట్టుకున్న అట‌వీ శాఖ ఐదో దానిపై దృష్టి పెట్టింది. దాన్ని పట్టుకోవడానికి వివిధ ప్రాంతాల‌లో బోనులు ఏర్పాట్లు చేశారు. మెట్ల…

Read Full News
isro aditya

“ఆధిత్య”అక్కడి వరకే…

భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట లంచ్ పాడ్ నుంచి సూర్యుని వైపు సంధించే ఆదిత్య-ఎల్ 1 శాటిలైట్ సూర్యుడిపై దిగేందుకు కాదని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఆదిత్య ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటూ అక్పకడి నుంచి పరిశోధనలు సాగిస్తుందని వివరించింది.ఆదిత్య వెళ్ళేది సూర్యుడు-భూమి మధ్య ఉన్న దూరంలో 1% వరకు మాత్రమే అని తెలిపింది. సూర్యుడు భారీ…

Read Full News
india c

అటు”వన్ ఎలక్షన్”.. ఇటు”ఇండియా”…

అటు మోడీ ప్రభుత్వం “వన్ ఇండియా.. వన్ ఎలక్షన్” వైపు పావులు కదుపుతుంటే మరోవైపు విపక్షాల కూటమి “ఇండియా” ముంబైలో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ రచనలు చేస్తోంది.

Read Full News
parlamant

రద్దు కానుందా…

గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. గత నెలలోనే వర్షా కాల వేశాలు ముగించుకున్న మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా తిరిగి సమావేశాలకు సిద్ధపడడం పలు రకాల ఉహాగానాకు తెర లేపుతోంది. కొందరు కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కోసమని, మరికొందరు జమిలీ ఎన్నికల కోసమని అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు అంశాలు కాకా పార్లమెంటును అంత అత్యవసరంగా సమావేశ పరచాల్సిన అవరసరం ఏముందని…

Read Full News
aparna

నటి ఆత్మహత్య…

ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్‌ మృతి చెందారు. ఆమె తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 7.03 గంటల సమయంలో అపర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. అపర్ణా నాయర్‌ కరమన సమీపంలో ఉన్న తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రయివేటు ఆసుపత్రి నుంచే తమకు సమాచారం అందిందని పోలీసులు…

Read Full News
sharmila sonia rahul

తప్పదిక….

తన తండ్రి, దివంగత నేత వై,ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. గురువారం దిల్లీలో కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన అనంతరం ఆమె పులివెందుల వెళుతున్నారు. శనివారం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో అయన స్మారకం వద్ద నివాళులు అర్పించిన తర్వాత పార్టీ విలీనం పై ప్రకటన చేయవచ్చనే బలమైన ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ…

Read Full News