gaddar

ఆగిన గానం…

ఆ గళం మూగబోయింది. కాలి గజ్జెల సవ్వడి మాయమైంది. ఎర్ర గుడ్డతో ఎగిరే విప్లవ కర్ర ఒరిగి పోయింది. దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన ప్రజా గాయకులు గద్దర్ ఇక లేరు. అపోలో ఆస్పత్రిలో చికత్స పొందుతూ అయన కన్నమూశారు. ఉపిరి తిత్తులు, ముత్ర కోశ సమస్యలతో గద్దర్ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. 77 ఏళ్ల ఈ ప్రజా మనిషి దాదాపు నాలుగు దశాబ్దాలుగా “గద్దర్” పేరుతో తెలుగు జన హృదయాల్లో నిలిచి పోయారు. ప్రజా…

Read More
tamil

ఆమోదం…

రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో  ప్రవేశపెట్టిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం పై ఉత్కంటకు తెర పడింది. వివధ అంశాలను పరిశీలించిన గవర్నర్ తమిళి సై ఆర్టీసీ ఉద్యోగులలు ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడానికి రూపొందించిన బిల్లు పై సంతకం పెట్టారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More
rajbhavan

బిల్లు లొల్లి తేలేనా…!

రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో  ప్రవేశపెట్టిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం పై ఇంకా ఉత్కంట కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు సంబందిచి ఐదు అంశాలపై గవర్నర్ తమిలిసై లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం రాజ్ భవన్ కి పంపింది. అయితే, ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో  గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అంతే కాకా, ఈ బిల్లు పై  ఉన్నతాధికారుల నుంచి గవర్నర్ మరిన్ని వివరాలు…

Read More
rajbhavan

వీటికి సమాధానం ఇవ్వండి…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లుపై సంతకం చేయడానికి ముందు ఐదు అంశాల పై గవర్ప్రనర్భు తమిలిసై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. రాజ్ భవన్ లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. 1, 1958 నుండి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటా లు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లు లో ఎలాంటి వివరాలు లేవు. 2, రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడం పై సమగ్ర వివరాలు…

Read More
rtc cf

మళ్ళీ లొల్లి షురూ..

రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ బంగ్లాకి మధ్య మళ్ళి రచ్చ మొదలైంది. గతంలో నలుగు ఫైళ్ళ పై సంతకం పెట్టలేదని సుప్రీం కోర్టును ఆశ్రయించిన బారాస ప్రభుత్వానికి తాజాగా మరో సమస్య తలెత్తింది. ప్రజా రవాణా వ్యవస్థను , ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రి వర్గ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ…

Read More

అటవీ భూమిలో “రామదూత”…!

లంచాలకు అలవాటు పడ్డ అధికార యంత్రాంగం అండదండలతో భక్తి ముసుగులో మోసాలకు పాల్పడుతున్నాడు ఓ నకిలీ స్వామీజీ. అటు అటవీ శాఖ, ఇటు పంచాయితీ రాజ్ శాఖల అలసత్వం వల్ల ప్రభుత్వ స్థలాన్నే ఆక్రమించి పూటకో వేషంతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ “కొత్త దేవుడు”  సుమారు పాతికేళ్ళుగా బహిరంగ అక్రమానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో అంతుపట్టని వ్యవహారం. ఇదంతా ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులోని “రామదూత” ఆశ్రమంలో చోటుచేసుకున్నభాగోతం. జాతీయ రహదారి పక్కనే కోట్లాది…

Read More
pres acadmy

“పెద్దసారు”కోసం…

తెలంగాణ మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో నాంపల్లి లోని పాత ప్రెస్ అకాడమీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఆ మేరకు  2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక…

Read More
Screenshot 2023 08 05 083323

లాల్ సలాం…

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు )ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ, దక్షిణ్ బస్తర్ డివిజన్ కమిటీ సంయుక్త విడుదల చేసింది. దండకారణ్యం -తెలంగాణ సరిహద్దుల్లో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. డప్పు వాయిద్యాల మధ్య పాటలు పాడుతూ ఊరేగింపు చేశారు. నృత్యాలతో దండకారణ్య ప్రాంతాన్ని హోరెత్తించారు. అనంతరం ఇటీవల అమరుడైన కటకం సుదర్శన్ స్థూపాన్ని ఆవిష్కరించారు. అమరుల ఆశయాలను కొనసాగిస్తామని మావోయిస్టు నేతలు స్పష్టం చేశారు. 

Read More
dimond

ఘనంగా చేస్తాం…

75 ఏళ్ల దేశ స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సి.ఎస్. శాంతి కుమారి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ ముగింపు వెడుకల్లో ప్రజా ప్రతినిదులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాలకు…

Read More
rahul 10

అగ్రనేతకు ఊరట..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన మంత్రి మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సరైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చింది. పరువు నష్టం కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్‌ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దీంతో రాహుల్‌ గాంధీకి ఊరట లభించినట్టయింది. దిగువ కోర్టులు అభియోగ పత్రాల సంఖ్య చూశాయే గానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ తరఫున వాదనలు…

Read More
Screenshot 2023 08 04 133649

వాణ్ణీ అలాగే చేయండి…

మహారాష్ట్ర లోని థానేలో ఉన్న బందోడ్కర్ కాలేజీలోని మహా దారుణం జరిగింది. ఆ కాలేజిలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి. శిక్షణలో జూనియర్లను ఓ సీనియర్ విచక్షణ రహితంగా కొట్టడం వివాదంగా మారింది. బందోడ్కర్ కాలేజీలో జూనియర్ లు తన మాట వినలేదని వారిని వర్షపు నీటిలో వంచి కర్రతో గొడ్డును బాదినట్టు చితకబాదాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపల్ సుచిత్ర నాయక్  చేతులు దులుపుకున్నారు. అయితే, పాశవికంగా కొట్టిన…

Read More
ktr j

ఇదా సమాధానం…

హైదరాబాద్ లో ఏంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇళ్ళ స్థాసాలు మంజూరు చేయాలని శాసన సభలో కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. జంట నగరాల్లో అనేక మంది జర్నలిస్టులు సుప్రీం కోర్టులో కేసు నెగ్గి కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. శాసన సభ జీరో అవర్ లో జగ్గారెడ్డి ఈ మేరకు ప్రస్తావించారు. అయితే , దీనికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ఇచ్చిన సమాధానం…

Read More
ranga asha

సెంట్రల్ లో “రంగా” కూతురు…!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి కరమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీతో జతకట్టడం, ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే క్రమంలో పురదేశ్వరిని ఆ రాష్ట్ర బిజెపి శాఖకు అధ్యక్షురాలిగా చేయడం, చంద్రబాబు నాయుడు మాత్రం తన పంజాలో అధికార పార్టీని ఎండగడుతూ లోకేష్ ని రోడ్ షోలకు పంపి రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెజవాడ  రాజకీయలు కేంద్ర బిందువుగా మారుతాయి….

Read More
ka paul 1

విశాఖ నుంచి పోటీ…

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏదో ఒక అంశాన్ని చర్చనీయాంశంచేస్తారు. వచ్చే ఎన్నికలలో విశాఖ పట్నం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమానికి హాజరైన అయన విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని పాల్ మండిపడ్డారు. విశాఖ స్థానికుదడిననీ, రానున్న రోజుల్లో ఇక్కడే నివాసం ఉంటానని చెప్పారు. అంతేకాక, రాబోయే ఎన్నికలలో విశాఖ…

Read More
central team in

నష్టం జరిగింది…

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమైంది. ఈ నెల ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్…

Read More