జ్ఞాపకాలు..
దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన స్మారకం వద్ద పలువురు నివాళులు అర్పించారు. ఆయన సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల స్మారకం వద్ద ప్రార్ధనలు జరిపారు.
దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన స్మారకం వద్ద పలువురు నివాళులు అర్పించారు. ఆయన సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల స్మారకం వద్ద ప్రార్ధనలు జరిపారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మహిళల సాధికారతకు పెద్ద పీట వేయడం జరిగిందని, 90 శాతం పైగా పథకాలను మహిళల పేరుతోనే అందించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మహిళలు సంక్షేమం పథకాలను తెలుసుకొని సామాజికంగా, ఆర్థికంగా లబ్ది పొందాలని ఆకాంక్షించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్తోన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని…
అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచరిస్తోంది. ఈ విషయం గుప్పుమనడం శ్రీవారి భక్తులు భయందోలనకు గురిచేస్తోంది. కాలిబాటలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అటవీ శాఖ ఐదో దానిపై దృష్టి పెట్టింది. దాన్ని పట్టుకోవడానికి వివిధ ప్రాంతాలలో బోనులు ఏర్పాట్లు చేశారు. మెట్ల…
భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట లంచ్ పాడ్ నుంచి సూర్యుని వైపు సంధించే ఆదిత్య-ఎల్ 1 శాటిలైట్ సూర్యుడిపై దిగేందుకు కాదని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఆదిత్య ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటూ అక్పకడి నుంచి పరిశోధనలు సాగిస్తుందని వివరించింది.ఆదిత్య వెళ్ళేది సూర్యుడు-భూమి మధ్య ఉన్న దూరంలో 1% వరకు మాత్రమే అని తెలిపింది. సూర్యుడు భారీ…
అటు మోడీ ప్రభుత్వం “వన్ ఇండియా.. వన్ ఎలక్షన్” వైపు పావులు కదుపుతుంటే మరోవైపు విపక్షాల కూటమి “ఇండియా” ముంబైలో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ రచనలు చేస్తోంది.
గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. గత నెలలోనే వర్షా కాల వేశాలు ముగించుకున్న మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా తిరిగి సమావేశాలకు సిద్ధపడడం పలు రకాల ఉహాగానాకు తెర లేపుతోంది. కొందరు కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కోసమని, మరికొందరు జమిలీ ఎన్నికల కోసమని అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు అంశాలు కాకా పార్లమెంటును అంత అత్యవసరంగా సమావేశ పరచాల్సిన అవరసరం ఏముందని…
ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్ మృతి చెందారు. ఆమె తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 7.03 గంటల సమయంలో అపర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. అపర్ణా నాయర్ కరమన సమీపంలో ఉన్న తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రయివేటు ఆసుపత్రి నుంచే తమకు సమాచారం అందిందని పోలీసులు…
తన తండ్రి, దివంగత నేత వై,ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. గురువారం దిల్లీలో కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన అనంతరం ఆమె పులివెందుల వెళుతున్నారు. శనివారం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో అయన స్మారకం వద్ద నివాళులు అర్పించిన తర్వాత పార్టీ విలీనం పై ప్రకటన చేయవచ్చనే బలమైన ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ…
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిటి బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుని శుక్రవారం విశాఖ పట్నం విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో నిర్వహించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని విశాఖలో అరెస్ట్ చేశారు.
అరుదైన జంతువులకు నిలయమైన నల్లమల అడవుల్లో అత్యంత క్రూర జంతువు సంచరుస్తోంది. మార్కాపురం డివిజన్ పరిధిలో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో పులి పై సైతం దాడి చేయగల అరుదైన మృగం జాడలు కనిపించాయని ఫారెస్ట్ రేంజర్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. దోర్నాల ప్రాంతంలోని నల్లమల అడవుల్లో “హనీ బార్జర్” అనే అరుదైన జంతువు ఉన్నట్లు అయన చెప్పారు. హనీ బార్జర్ మందమైన చర్మాన్ని కలిగి ఉండి, ఏకంగా పులుల వంటి క్రూర జంతువులపై సైతం పోరాడే…
అమాయక చూపులతో, ఆకర్షించే నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన గుండుమల్లె లాంటి బొద్దుగుమ్మ, అందాల కేరళ కుట్టి మీరా జాస్మిన్ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 20 ఏళ్ల కిందట తెలుగు,తమిళ, మలయాళం వెండి తెరల పై నిండిన పాత్రలతో అన్ని వర్గాల అభిమానులను సొంతం చేసుకున్న నటి మీరా. ”అమ్మాయి బాగుంది” అంటూ తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె భద్ర, గుడుంబా శంకర్, రారాజు, అ.ఆ.ఇ.ఈ., గోరింటాకు, యమగొల మళ్లీ మొదలైంది, మహారధి, మొన్న వచ్చిన…
రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ నియోజక వర్గంలో పరిస్థితులు మారబోతున్నాయా? అధికార పార్టీ నేత ఆశిస్తున్న హ్యాట్రిక్ విజయం ఆయన్ని వరిస్తుందా? ఎన్నికలు సమిస్తున్నందున డోన్ లో ఇలాంటి సవ్వా లక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకొవలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. వైసిపి నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. ఈ సీటును వరుసగా రెండుసార్లు కైవసం…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. వినువీధిలో పరిశోధనల కోసం “సొంత ఇల్లు” కట్టడానికి సన్నాహాలు చేస్తోంది. మరో ఏడేళ్ళలో అంటే 2030 సంవత్సరానికి ఇస్రో పూర్తీ స్థాయి దేశీయ పరిజ్ఞానంతో స్పేస్ స్టేషన్ నిర్మించనున్నట్టు వెల్లడించింది. ఈ స్టేషన్ లో వ్యామోగాములు సుమారు 15 నుంచి 20 రోజు పాటు ఉంటూ పరిశోధనలు జరపొచ్చని వివరించింది. భూమికి నలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఈ స్పేస్ స్టేషన్ ఉంటుంది.
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు రాఖీ కట్టారు. “ఇండియా” కూటమి సమావేశం కోసం ముంబై వచ్చిన దీదీ “బిగ్ బి” ఇంటికి వెళ్లి రాఖీ బంధనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రోజు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవాళ భారత్ రత్న అమితాబచ్చన్ను కలిశానని, దసరా పండుగకు బెంగాల్లో జరిగే దుర్గా పూజకు, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కావాలని ఈ సందర్భంగా అమితాబ్ను ఆహ్వానించినట్టు మమత చెప్పారు.
జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొంది మంచి జోరుమీదున్న స్టైలిష్ స్టార్ పుష్ప అల్లు అర్జున్ అనుకున్నట్టుగానే గానే అభిమానులకు ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో చూపించడానికి ఓ వీడియోను రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగు తోందని, ఇక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీచెప్పుకోచ్చారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అంటూ మూవీపై అంచనాలను ఇట్టే పెంచేసారు. సుకుమార్ తో సరదాగా కనిపించారు.