దిల్లీలో “పెద్దన్న”…
జి -20 సదస్సులో పాల్గొనేందకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ రాజధాని ఢిల్లీ కి చేరుకున్నారు.
జి -20 సదస్సులో పాల్గొనేందకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ రాజధాని ఢిల్లీ కి చేరుకున్నారు.
ఈ నెల 16,17 తేదీలలో హైదరాబాద్ లో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో హాజరయ్యే జాతీయ నాయకుల భద్రత కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు డీజీపీ అంజనీ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17న తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయన్నారు. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని…
రాష్ట్రంలో అమలు పరుస్తున్న ఇసుక పాలసీ దేశం లోనే ఉత్తమమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గనులు,భూగర్భ వనరుల శాఖ పై ఉన్నతాధికారులతో డా.బి.ఆర్. ఆంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో ఆయన గనులు మరియు భూగర్భ శాఖ పనితీరును సమీక్షించారు. ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన…
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరిగి ఎందుకు వేగం పెంచిందనేది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చర్చననీయాంశంగా మారింది. రెండు రోజుల కిందట నిందితుడు బుచ్చిబాబుని ఈ.డి. విచారించడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కథ ఎటువైపు తిరుగుతుందో అనే గుబులు పట్టుకుంది. ఈ.డి. ఒక్కసారిగా దూకుడు పెంచిందనే దానిపై అరా తీయడం మొదలైంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ…
జీ.20 శిఖరాగ్ర సమావేశాలకు దేశ రాజధాని డిల్లీ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ 18 వ జీ.20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న భారత్ అతిధుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రగతి మైదానంలోని భారత్ అంతర్జాతీయ ప్రదర్శన సమావేశ మందిరం (ఐ.ఇ.సి.సి.)లో శని, ఆదివారాలలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో రాజధాని కళకళలాడుతోంది. ఈ రాత్రికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దిల్లికి చేరుకుంటారు. కేంద్ర విదేశాంగ శాఖ…
మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగుల రక్షణకు, వారి పరిరక్షణకు తక్షణమే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రతేక చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు. ఈ సమస్యల న్నింటిపై అక్టోబర్ 2 గాంధీ జయంతిన ఢిల్లీలో పెద్ద ఎత్తున జర్నలిస్టులతో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు….
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడాది అయిన సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున భారత్ జోడో పాదయాత్ర లు, సభలు జరిగాయి. టీపీసీసీ ఆధ్వర్యంలో సోమజిగూడా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరమ్మ విగ్రహం వరకు జరిగిన భారీ ర్యాలీ లో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్…
జపాన్ కూడా అంతరిక్ష పరిశోధనలో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దేశం కూడా చంద్రునిపై సాఫ్ట్ లాండింగ్ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వేస్టిగేటింగ్ మూన్ (ఎస్.ల్.ఐ.ఎం.) అనే అంతరిక్ష నౌక చంద్రుడిపైకి దూసుకెళ్లింది. జాక్సా ట నేగషిమా స్పేస్ సెంటర్ నుంచి గురువారం తెల్లవారుజామున 5:12 గంటలకు హెచ్2-ఎ. రాకెట్ ఈ నౌకను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండ్ చేసిన…
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సంగ్మా గౌరవార్ధం తేనీటి విందు ఇచ్చారు. కాసేపు ఇరువురు ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నారు. అనంతరం సీఎం సంగ్మాను శాలువాతో సిఎం కేసీఆర్ సత్కరించి,మెమొంటో బహుకరించారు. తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎం కు సిఎం కేసీఆర్…
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి పన్నెండు, ఒంటి గంట మధ్య ఈ…
హైదరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమి వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పేట్ బషీరాబాద్ లో గత ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి బదలాయించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అంతేకాక్, ఈ నెల 6 తేదిన సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న పరిణామం అంతుపట్టకుండా ఉందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ లో 2023 – 2024 విద్యా సంవత్సరానికి గానూ జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైఫరీ (జిఎన్ ఎం) ట్రైనింగ్ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 02.09.2023 నుండి 16.09.2023 వరకు అందుబాటులలో ఉంటుందని అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను ప్రభుత్వ స్కూళ్లలో 19.09.2023 లోగా ప్రైవేట్ స్కూల్ లలో 10.10.2023తేదిలోగా…
తనను ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులపై అయన పరోక్షంగా స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. జగన్…
మహా నటులు ఎన్టీఆర్ భారత దేశ సంపద, ఒక మహాశక్తి, గొప్ప వ్యవస్థ అని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటక రాష్ట్ర బళ్లారిలో స్థానిక తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా, బళ్లారిలో ఉన్నానా అన్న సందేహం కలుగుతోందన్నారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహం ఏర్పాటు…
నటనకి, నిజ జీవితానికి ఎంత తేడా ఉంటుందో ఈ చిత్రాన్ని చుస్తేనే అర్ధం అవుతుంది. ఆమె సహాయకుడు సాయి వివాహానికి హైదరాబాద్ వచ్చిన రాష్మిక నిండైన దుస్తులతో చూపరులను ఆకట్టుకుంది. ఆమెను చూసిన వారు ఒక్కసారిగా కెమెరా ముందు ఆమె నటనను ఉహించుకున్నారు.