pawar c

ఇక పై “కోటి”…

తెలంగాణాలో విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ప్రజాభవన్ లో ఏర్కోపాటు చేసిన కార్యక్రమంలో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖలో నరేష్ భార్యకు కారుణ్య నియామక పత్రం అందజేశారు. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును…

Read Full News
IMG 20240730 WA0012

చరిత్ర లోనే రికార్డు

స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల…

Read Full News
IMG 20240711 WA0000

తెలంగాణ మైనింగ్ సెంట‌ర్

ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివ‌ర్సిటీ – ఐఐటీ హైద‌రాబాద్ ఐఐటీ స‌హ‌మాకారంతో మైనింగ్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మాకారం అందిస్తుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు. ఈ రోజు డాక్ట‌ర్ బీఆర్ ఆంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో భ‌ట్టి విక్ర‌మార్క‌తో ఐఐటీ హైద‌రాబాద్ కు చెందిన ప్రొఫెస‌ర్ మూర్తి, ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెస‌ర్ ఎలిశెట్టి మోహ‌న్ లు ప్రత్యేకంగా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా బ్యాట‌రీల‌లో…

Read Full News
IMG 20240706 WA0053 1

తొలి అడుగు..కమిటీలు…

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశ వివరాలను భట్టి వివరించారు.రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో…

Read Full News
revant nitin

గడ్గరీ తో….

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధిల్లీలో భేటి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాదు…

Read Full News
IMG 20240205 WA0008

అధినేత్రితో…

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాతో సమావేశమయినట్టు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. అంశంపై రాష్ట్ర పార్టీ తీర్మానం…

Read Full News
batti pwr

విద్యుత్ కు “అప్పుల” షాక్…

గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనిరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్దతో ప్రణాళికా బద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు బిటిపిఎస్ విద్యుత్ ప్లాంటును సందర్శించిన అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు….

Read Full News
revanth bhti.pc

“ప్రజాపాలన”కు సాయపడండి…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్ర  ప్రయోజనాలను కాపాడడం కోసం మొట్ట మొదటిసారిగా దేశ ప్రధాని మోడీని ముఖ్యమంత్రి  హోదాలో మర్యాకలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి కోరి తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని  వీటికి సంబంధించి విభజన చట్టంలో పేర్కొన్న హక్కులను సాధించడంలో పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి…

Read Full News
revnth modi 1

మోడీతో రేవంత్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి మోడిని కలిశారు. రాష్ట్రానికి సంబధించిన అనెక్ అంశాలపై చర్చించారు. అయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.

Read Full News
IMG 20231217 WA0031

రేవంత్ తో రాజన్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్…

Read Full News
IMG 20230915 WA0031

భేటీ…

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ తెలంగాణా ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ తదితరులు హైటెక్ సిటీ మాదాపూర్ లోని తుమ్మల నివాసానికి వెళ్లారు. రాబోయే ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థతులపై చర్చించారు.

Read Full News