“ప్రజాపాలన”కు సాయపడండి…

revanth bhti.pc

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్ర  ప్రయోజనాలను కాపాడడం కోసం మొట్ట మొదటిసారిగా దేశ ప్రధాని మోడీని ముఖ్యమంత్రి  హోదాలో మర్యాకలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి కోరి తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని  వీటికి సంబంధించి విభజన చట్టంలో పేర్కొన్న హక్కులను సాధించడంలో పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.

revnth modi batti 1

విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావలసిన హక్కులు, హామీలను త్వరితగతిన అమలు చేయాలని ప్రధాని మోడీని కోరినట్టు తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ ప్రాజెక్టులను వెంటనే ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని, తెలంగాణ కావాలని ఏ నీళ్ల కోసం పోరాటం చేసామో  ఆ నీళ్లను ఈ రాష్ట్రానికి అందించడానికి విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని అందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిగణలోకి తీసుకొని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. ఐఏఎం, సైనిక్ స్కూల్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 14 రోడ్ల ప్రతిపాదనలు, విభజన చట్టం ప్రకారం బ్యాక్ డెవలప్మెంట్ ఫండ్ పెండింగ్ గ్రాంట్స్ విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఆదేశాలు ఇవ్వాలని, 2019 -20 నుంచి 2023- 24 వరకు పెండింగ్లో ఉన్న దాదాపు 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు.తెలంగాణ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన తెలంగాణగా నిర్మించాల్సిన బిఆర్ఎస్ ఆర్థిక అరాచకంతో ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని,  ఇబ్బడి ముబ్బడిగా  అప్పులు తెచ్చి రాష్ట్రంపై పెనుబారం మోపిన విషయాన్నికూడా  మోడీ దృష్టికి తీసుకువెళ్లినట్టు,  ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ప్రధానిని కోరినట్టు రేవంత్ తెలిపారు. 2019 -20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు 450 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన 2,250 కోట్ల రూపాయల గ్రాంట్స్ ను సాధ్యమైనంత వీలుగా విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం విద్యా వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన  సహాయ సహకారాలను అందించాలని చేసిన చేసిన విజ్ఞప్తినకి  ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించినట్టు కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం ఒక రాష్ట్రానికి అందించాల్సిన సాయం ఏ విధంగా అందిస్తామో అదేవిధంగా అందిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం  నివేదిక సైతం ప్రధానమంత్రి అందజేసినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *