bjp wrong cf

గుడిని కూల్చడం సాధ్యమా…?

నాలుగు వందల స్థానాలు గెలుస్తామని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధినేతల మాటల్లో అవేశం కనిపించడం ఆశ్చర్య పరుస్తోంది. దేశంలో మూడో దశ పోలింగ్ పూర్తీ అయిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆధిత్యనాథ్ లాంటి భాజాపా నేతల ప్రసంగాల్లో ఉహించని మార్పు కనిపిస్తోంది. ఈ నేతలు “ఇండియా కూటమి” పైనా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద విసురుతున్న ఘాటైన విమర్శనాస్త్రాలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి….

Read Full News
IMG 20240414 WA0007

ఏం జరుగుతోంది..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు…

Read Full News
eleccomis last

ఇలా చేయండి…

ఈ నెల ౩౦వ తేదీన జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జాయింట్ కమిషనర్ మంగతాయారు తెలిపారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఆమె మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సహాయ అధికారులు ఉంటారని తెలిపారు. ప్రిసైడింగ్…

Read Full News
electn com 1

రైతు”బంద్”…!

తెలంగాణలో రైతుబందు పధకం అమలుకు మూడు రోజుల కిందట అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వాస్తవానికి మంగళ వారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు జమకావలసి ఉంది.అయితే, ఈ నెల 28న రైతుబంధు పంపిణీ చేస్తారని బిఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన పత్రికా ప్రకటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లఘిన్చినందుకు రైతుబందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.

Read Full News
evm

అతిక్రమిస్తే ఉక్కు పాదం…!

వచ్చే ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలలో స్వల్ప మార్పు చేసింది. ఈవీఎంపై గతంలో పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే  ఉండేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో వీటితో పాటు అభ్యర్థి ఫొటో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పైనా అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా…

Read Full News
cec c

ఐదు రాష్ట్రాలకు మోగింది…!

దేశం లోని ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ వివరించారు. తెలంగాణా సహా ఛత్తీస్ ఘర్,  మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు. తెలంగాణాలో నవంబర్ ౩౦వ తేదీన ఒకేవిదతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని నవంబర్ ౩న విడుదల చేస్తారు….

Read Full News
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read Full News
IMG 20231003 WA0049

షెడ్యూల్ కోసం…

తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణను అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతో పాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజుల పాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం…

Read Full News