దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి కోసం ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించనున్నట్టు వివరించారు. ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, మళ్ళీ ఇంటి వద్దకు చేర్చే బాధ్యతను అధికారులే చూసుకుంటారని రాజీవ్ చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించు కోవలనుకునే వారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోగా 12.డి. ఫారం కింద సంబంధిత అధికారులకు దరఖాస్తు చేయాలని సూచించారు