ips c

“మర్లకుంట”లో రక్షణ.. “జత్వానీ”తో జైలు..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా ప్రశంశలు అందుకున్న ఐపిఎస్ అధికారి పెండ్యాల సీతా రామాంజనేయులు ఎక్కడ తప్పటడుగు వేశారు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలకు సన్నిహితంగా ఉన్న ఆయన శత్రువుగా ఎలా మారారు? టిడిపి నేతలకు దగ్గర అని తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి పీ.ఎస్.ఆర్. ని ఏరికోరి ఎందుకు దగ్గరకు తీశారు? చేసిన తప్పిదాల కంటే సామాజిక వర్గ వేటకు చిక్కుకున్నారా?  ఇవీ పీ.ఎస్.ఆర్. అరెస్టుతో…

Read Full News
Tar c

పాలన అంటే “ప్రతీకారం”..!

ప్రజాస్వామ్యంలో రాజకీయం వేరు. పగ, కక్షలు, కార్పణ్యాలు వేరు. రాజకీయాలు అనేక లక్ష్యాలతో నాయకులు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాయి. కక్షలు వ్యక్తిగత వ్యవహారాలతో ముడిపడి పగతో రగిలిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ఏ రాజకీయం చేయాలనుకున్నా అవి రాజ్యాంగానికి కట్టుబడి తీరాలి. అదే కక్ష సాధింపునకు తెగించాలనుకుంటే నీతి, నియమాలతో గానీ, ఏ చట్టంతో గానీ పని లేదు. మూర్ఖపు ఆలోచనలతో వ్యూహాలు వేస్తే చాలు. నువ్వా…నేనా…అంటూ రోషాలు పెంచుకుంటూ బలం చూపుకుంటే అదే హీరోయిజం….

Read Full News
mic c

మైకుల విలువ తెలియదా..!

దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు వేదిక అవసరం. అందుకే  ఢిల్లీలో పార్లమెంట్, రాష్ట్రాల్లో శాసన సభలు పని చేస్తోంది. రాజ్యాంగంలోని నియమ, నిబంధనలకు లోబడి పని చేస్తున్న ఈ చట్ట సభలను గౌరవించడం ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత. ప్రజల సంక్షేమం కోసం కొలువుదీరినవే ఈ సభలు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో గంపెడు ఆశలతో, కొండంత నమ్మకంతో నేతలను తమ ప్రతినిధిలుగా ఎన్నుకొని చట్టసభలకు పంపుతారు. ప్రజా సమస్యలను, వారి సంక్షేమానికి అవసరమైన పనులు, పధకాలపై…

Read Full News
adani c

మోడీ పెంచిన “మనీ”కొండ..!

నరేంద్రమోడీ, నీరబ్ మోడీ, అదానీ… దేశంలో 2014 వరకు ఈ మూడు పేర్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే జనానికి తెలుసు. ఎన్.డి.ఎ. అధికారం చేపట్టక ముందు వరకు వ్యాపార రంగంలో అదానీ ఒక అడ్రస్ లేని వ్యక్తి. నీరబ్ మోడీ జాడ కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి అనామకులు రాజకీయాల అండదండలతో దేశ ప్రజలు చూస్తుండగానే అనతి కాలంలోనే అపర కుబేరులుగా మారారు. వీళ్ళ అక్రమ మార్గాల ధాటికి దశాబ్దాలుగా వివిధ వ్యాపారాల్లో…

Read Full News
images 17

పార్టీలు పెంచిన “ప్రశాంత్”.!

ప్రశాంత్ కిషోర్… ఈ పేరు సామాన్య జనానికి అంతగా తెలియదేమో, కానీ, ఎన్నికల సంగ్రామంలో జరిగే రాజకీయ చదరంగంలో ఆయన ఒక వ్యూహకర్తగా పార్టీలకు, నాయకులకు సుపరిచితుడు. దశాబ్ద కాలం కిందట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంలో కిషోర్ వ్యూహం కూడా కారణం అనే ప్రచారం ఉంది. అంతే కాదు,2012వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా ఆయనే ప్రధాన కారణం అనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఆయన దేశంలోని…

Read Full News
Screenshot 20240728 210106 Gallery

అన్నను వదలని చెల్లెలు..!

రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా అధికార పక్షాన్ని వేలెత్తి చూపుతాయి. ప్రజావ్యతిరేక విధానాల్లో లోపాలను ఎండగడతాయి. వాటి పరిష్కారానికి పోరాడతాయి. కానీ, ఆంద్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ పార్టీ వైసీపీని రచ్చేకిడ్చే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్…

Read Full News
IMG 20240721 WA0011

“అనిత” అక్కసు…

గతంలో చంద్రబాబుకు ఇచ్చిన కారును ఇప్పుడు జగన్ కు ఇచ్చామని ఆంద్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఇప్పుడు జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ఆ మహానటుడు జనాలకు కనిపించడం లేదని వేరే కారు ఎక్కావంటూ జగన్ పై విరుసుకుపడ్డారు. చంద్రబాబుకు పదేళ్ల పాటు వాడిన వాహనాన్ని కనీసం మరమ్మతులు కూడా చేయించకుండా జగన్ కు కేటాయించారని, వైసీపీ చేసిన ఆరోపణలపై అనిత స్పందించారు. “బాబూ పులివెందుల ఎమ్మెల్యే, నువ్వు ఇంతకుముందు ఓసారి ఏం చేశావో గుర్తుకు…

Read Full News
zero c

పార్టీ మూత  – ఫలితాలు సున్నా…

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టపరిచే వ్యూహాలతో  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తుంటే దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ లో అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చిన అధిష్టానానికి  ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి ఇరకటంలోకి లాగింది. మూడేళ్ల కిందట తెలంగాణ నా “మెట్టినిల్లు”, ఇక్కడే చదివా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, పిల్లాలను కన్నా, చివరి వరకు ఇక్కడే ఉంటా…

Read Full News
furnichr c

“బోడి”ఫర్నిచర్ అప్పుడేమైంది..!

“బోడి ఫర్నిచర్”..ఈ మాట ఐదేళ్ళ కిందట గుర్తుకు వస్తే ఎంత బాగుండేదో. ఒక నిండు ప్రాణం ఈ రోజుకి బతికి ఇండేది. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు, సామాన్య జనం గుర్తు చేస్తున్న అంశం. అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపుల వైపు వెళ్ళక పోతే  ఆంద్రప్రదేశ్ లో ఈ రోజు వైసిపి స్థాయి వేరుగా ఉండేది. 2019లో అధికారం చేపట్టిన మరుక్షణమే జగన్ ప్రభుత్వం  కరకట్ట కూల్చివేతలు, కోడెల శివప్రసాద్…

Read Full News
hand fan c

చెల్లిని తీసేయండి – నేను చూసుకుంటా ?

ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.  ప్రజలు ఇచ్చిన “ఒక్క ఛాన్స్”ని ఐదేళ్ళ పాటు ఒంటెద్దు పోకడలతో చేజార్చుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకున్న  తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ శ్రేణులతో జనంలోకి వెళ్ళలేని దుస్థితి నెలకొంది. అడ్డూ అదుపు లేని మాటలతో  వైసీపీని…

Read Full News
Screenshot 20240623 191751 WhatsApp

“Target” Demolision…

In a significant development in TDP’s vendetta politics in Andhra Pradesh, the under construction YSRCP party’s central office in Tadepalli was demolished despite High Court order. This unprecedented action, the first instance of a party office being demolished in the state’s history, commenced around 5:30 am using excavators and bulldozers.The demolition proceeded even though the…

Read Full News
katha c

ముంచిన “కుటుంబ కథా చిత్రం”..!

జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఆంద్రప్రదేశ్ లో ఈ సారి కొత్త తరహా దెబ్బ తగిలింది. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలవడానికి, ఓడిపోవడానికి అక్కడి రాజకీయ సమీకరణలు కారణమైతే, ఆంధ్రాలో మాత్రం కేవలం కుటుంబ కలహాలు పార్టీ ఆశలను బూడిదలో పోశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రతికూల వాతావరణం ఏర్పడిందని, దాన్ని అవకాశంగా మలచుకొని లబ్ధి పొందవచ్చనుకొని  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పావులు…

Read Full News
reviw c

ఇక్కడ”దోపిడీ”-అక్కడ”అరాచకం”..!

తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజంగా తెలివైన వారే అని ప్రపంచానికి చాటారు.మాటలు ముఖ్యం కాదు, చేతలు కావాలని తేల్చి చెప్పారు. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీని చిత్తుగా ఓడించారు. మొన్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపిని నామరూపాలు లేకుండా చేశారు. తెలంగాణలో “కారు”ని షెడ్డుకి పంపితే, ఆంధ్రాలో “ఫ్యాన్”గాలి సోకకుండా అదుపు చేశారు. అదే తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం. అయితే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఆంధ్రా రాష్ట్రంలో వైసిపి కుదేలు కావడానికి ఒకటే…

Read Full News
ap campan c

ఆధిపత్యమా – ఆస్తి కోసమా..!

అంధ్రప్రదేశ్ ఎన్నికల చదరంగంలో రాజకీయ వ్యవహారాలతో పాటు కుటుంబ తగాదాలు, కక్షలు భగ్గుమంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రస్తుత పరిస్థితి కనిపించ లేదు. ఏ ఎన్నికల్లో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ జనాన్ని ఓట్లు అడిగే వారు. కానీ, ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారం మొత్తం కుటుంబాల పరువు, మర్యాదలను  వీధులకు ఈడ్చుకునే  రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్,…

Read Full News
viveka c

“వివేకా”హత్య..? సిబిఐకి “మచ్చ”..?

అంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించి, వివాదంగా మారిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య ఉదంతం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. అనేక పరిణామాలు, అనుమానాల మధ్య కేంద్ర నేర పరిశోధన సంస్థ (సిబిఐ) చేతికి వెళ్లిన ఈ సంఘటన విచారణ తీరు పై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబిఐ ప్రతిష్ట పై మచ్చ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పక్కా పథకం…

Read Full News