ఫోరెన్సిక్ ఆడిట్ కావాలి..
తెలంగాణాలో భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ధరణి పోర్టల్పై రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది.. ధరణి పోర్టల్ను ఉపయోగించుకుని అధికార పార్టీ నేతల అండతో కొందరు భూములను ఆక్రమించుకోవడమే కాకా ఇతర అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్,ఆయన కుమారుడు కేటీఆర్ సైబర్ నేరగాళ్లలా ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోర్టల్ వెనుక భూస్వాములు ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు….