IMG 20240319 WA0038

తొమ్మిది ప్రాణాలు…

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకి తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు కోల్‌కతా మేయర్‌ ఫిర్హద్‌ హకీమ్‌ తెలిపారు. ఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ప్రమోటర్‌ను అరెస్టు చేసినట్లు మేయర్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలానికి వెళ్లి…

Read More
IMG 20240310 WA0204

రంజాన్ దీక్షలు…

దేశంలో 12వ తేదీ నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. నెలవంక దర్శనం ఇవ్వడంతో సౌదీ అరేబియాలో 11 నుంచి దీక్షలు మొదలవుతున్నాయి.

Read More
IMG 20240217 WA0028

“పీచు”కు మంగళం..!

పిల్లలను, యువతను చవులురించే పీచు మిఠాయి అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలను వాడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read More
IMG 20240217 WA0019

దూసుకెళ్లిన “ఎఫ్‌14”..

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌-3డీ, ఇన్‌శాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపు గానే ఇన్‌శాట్‌-3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్‌-3డీఎస్‌ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్ లు ఉన్నాయి. ఈ పేలోడ్ లు వాతావరణ అంచనా,…

Read More
IMG 20240216 WA0033

రైతులపై”కర్ణా”అస్త్రం..

కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్‌ రైతులపై పోలీసులు ‘సోనిక్‌ ఆయుధాల’ను ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయడం సోనిక్‌ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్‌ రేంజ్‌ అకూస్టిక్‌ డివైజ్‌(ఎల్‌ఆర్‌ఏడీ)గా పిలిచే సోనిక్‌ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాడుతున్నారు. అమెరికా సైన్యం అమ్ముల పొదిలో 2000 సంవత్సరం నుంచే సోనిక్‌ ఆయుధాలుండగా 2013లో ఢిల్లీ…

Read More
judgs

ఆ మార్గం తప్పు…

ఎలక్టోరల్ బాండ్స్ స్కీం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేయాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు గోప్యంగా ఉంచటం సరైన పద్ధతి కాదని తెలిపింది. అలాగే ఇది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఒకరకంగా క్విడ్…

Read More
gulf modi

ఒప్పందాలు సరే.. కార్మికుల సంగతి…

ప్రధాని నరేంద్ర మోదీ  రెండు రోజులు అబుదాబిలో పర్యటించిన సందర్భంగా యూఏఈ దేశంతో ఎనిమిది వ్యాపార  ఒప్పందాలు చేసుకున్నారు, కానీ  గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకోలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ బి.ఎం. వినోద్ కుమార్, కన్వీనర్ మంద భీంరెడ్డి వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ స్వదేశానికి అత్యధిక…

Read More
modi uae

అక్కడ మరో దేవాలయం…

ప్రధాని నరేంద్ర మోదీ ఈ 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఇ) లో పర్యటించనున్నారు. 13న ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో సమావేశ మవుతారు. ఈ భేటీలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన పలు రకాల అంశాలపై చర్చిస్తారు. అనంతరం, దుబాయ్ కేంద్రంగా జరిగే ప్రపంచ ప్రభుత్వాల సమ్మేళనం -2024 లో అతిధిగా హాజరై ప్రసంగిస్తారు. అదేవిధంగా ఈ పర్యటనలోనే అక్కడి ప్రవాస భారతీయులు అబుదాబి లో…

Read More
IMG 20240211 WA0015

ఇక “జి.పి.ఎస్.”టోల్…

గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించే వారు, తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు.ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి, తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్‌ల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం…

Read More
pv

“Bharat Ratna” PV..

As a distinguished scholar and statesman, Narasimha Rao served India extensively in various capacities. He is equally remembered for the work he did as Chief Minister of Andhra Pradesh, Union Minister, and as a Member of Parliament and Legislative Assembly for many years. His visionary leadership was instrumental in making India economically advanced, laying a…

Read More
isro 30

ఇక ప్రయోగాల రచ్చ..

రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆర్గ నైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సమీకృత ప్రయోగ మేనిఫెస్టోను ప్రకటించింది. వచ్చే 14 నెలల్లో చేపట్టనున్న ప్రయోగాల్లో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించినవి ఏడు ఉన్నాయని అందులో తెలిపింది. స్కైరూట్‌, అగ్నికుల్‌ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల…

Read More
soren c

సోరెన్ కు “చాట్” ఉచ్చు..

భూ కుంభకోణం కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ.డీ. అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు. 539 పేజీలతో ఉన్న ఈ చాట్‌లో మరికొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోరెన్ తన సన్నిహితులతో కలిసి ప్రభుత్వ భూములను లాక్కోవడమే కాకుండా లంచాలు తీసుకుంటూ అధికారులను వారు కోరిన చోటకి బదిలీ చేసినట్లు తేలింది….

Read More
isro robo

స్పేస్ రోబో “వ్యోమ‌మిత్ర‌”..

ఈ సంవ‌త్స‌రం అక్టోబర్‌లో గగన్‌యాన్‌ మిషన్‌ను అంతరిక్షం లోకి పంపేందుకు సిద్ధమైంది. గగన్‌యాన్ ప్రోగ్రాంలో భాగంగా చేప‌ట్టిన మాన‌వ ర‌హిత అంత‌రిక్ష ప్ర‌యోగంలో ఇది ఒక భాగ‌మ‌ని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్‌ సింగ్ అన్నారు. అక్టోబర్‌ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌ను ఇస్రో చేపట్టనుందని తెలిపారు. రెండో ప్రయోగంలో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షం లోకి పంపనున్నారు. మనిషి మాదిరిగానే అన్ని పనులు నిర్వహించగలిగే ఈ రోబోను…

Read More
adwani

“రథ”యాత్రికునికి”రత్నం”…

భారతీయ జనతా పార్టీ కురు వృద్ధులు లాల్ కిషన్ అద్వాని దేశ అత్యున్నత పురస్కారమైన “భారత రత్న” వరించింది. దేశంలో బిజెపి మూలాలు విస్తరించడానికి ఆయన సేవలు ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1990 దశకంలో అయోధ్య రామ మందిర వివాదం పై అద్వాని జరిపిన “రథ యాత్ర” బిజెపి, సంఘ్ పరివార్ లు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయనను “రత్న”తో పురస్కరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read More