మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సంగ్మా గౌరవార్ధం తేనీటి విందు ఇచ్చారు. కాసేపు ఇరువురు ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నారు. అనంతరం సీఎం సంగ్మాను శాలువాతో సిఎం కేసీఆర్ సత్కరించి,మెమొంటో బహుకరించారు. తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎం కు సిఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. మంత్రులు కేటీఆర్,హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధు సూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి,బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్,కె. వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
