సంస్కరణలు రావాలి…!

kavit 2 c

తెలంగాణా అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమినీ -‌ యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరించామని తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఉదాహరణకు చెరువులు మరమ్మత్తు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు సంభవించిందని వివరించారు.

kavitha londn 2 c

దళిత బంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగాయని చెప్పారు. వ్యవస్థీకృత డెలివరీలను ప్రోత్సహించడానికి గానూ శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు కేసీఆర్ కిట్ లు పంపిణీ చేస్తున్నామని, గర్భిణీ సమయంలోనూ నెలకు వెయ్యి రూపాయలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని అన్నారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సహంతో సాంఘీక సంక్షేమ పాఠశాలలో చదివే మాలవత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిందని ప్రస్తావించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పామని, తద్వారా మైనారిటీల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా పాఠశాలలకు వెళ్తున్నాయని చెప్పారు. మోడల్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నామని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా హాస్టల్ తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రిసెర్చ స్కాలర్లకు స్టైఫండ్ ను మూడు సార్లు పెంచామని, కానీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక జీతాలు ఇస్తోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కు 30 శాతం రిస్క్ అలవెన్సు అందిస్తున్నామని, రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 20 వేల వేతనం లభిస్తోందని వివరించారు. హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల గురించి కవిత వివరించారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పడంలో సందేహమే లేదని, తెలంగాణ ఏర్పాటు కావడమే తన లక్ష్యమని పదువులుముఖ్యం కాదని కేసీఆర్ అన్నారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. తాను ప్రచారం చేస్తున్న క్రమంలో ఒక గ్రామీణ మహిళా తనకు ఒక వెయ్యి రూపాయల ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అయితే, నేరుగా రాజకీయాల్లోకి రాకుండా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించానని తెలిపారు. ఆ సంస్థ ద్వారా మహిళా సాధికాతరకు కార్యకలాపాలు చేపట్టడమే కాకుండా తెలంగాణ సంస్కృత, సంప్రదాయాలను ప్రోత్సహించామని, ముఖ్యంగా బతుకమ్మ పండగను ప్రతీ ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వచ్చామని వివరించారు. ప్రస్తుతం 65-70 దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేశానని చెప్పారు. ప్రజా జీవితంలో మనం ఏమిటో అన్నది మాత్రమే ప్రజలు చూస్తారని, కుటుంబ నేపథ్యాన్ని కాదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *