కేసీఆర్ కారకుడు…

IMG 20231027 WA0010

బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పూర్తీ బాధ్యత వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బ్యారేజీ కేవలం మూడు సంవత్సరాలకే కుంగి పోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం చేపట్టి 2019 జూన్ 21న ప్రారంభించారని తెలిపారు. ఈ బ్యారేజీ నాణ్యత లోపానికి కేసీఆర్ కుటుంబమే కారణమని అని లేఖలో తెలిపారు.పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారని విమర్శించారు. నిర్మాణ సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయనీ, కానీ ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు. ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను సహితం రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసు బలగాలతో ముందస్తుగా అరెస్టులు చేసి వారిని ధర్నాలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.విషయం బయటకు రాకుండా అణిచివేశారనీ, మీడియాను కూడా బెదిరించి కట్టడి చేశారన్నారు. ప్రజాధనం వృధా చేసిన కేసీఆర్ దే పూర్తి బాధ్యత అని మావోయిస్టులు పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *