విశాఖ సాగర తీరాన “నేవీ మారథాన్” ఉత్సాహంగా సాగింది. నగరంలోని ఆర్కే బీచ్ పార్క్ కూడలి వద్ద నిర్వహించిన ఈ మారథాన్లో పెద్ద సంఖ్యలో యువతీ,యువకులు, నేవీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కూడలి నుంచి భీమిలి వరకు ఈ రన్ నిర్వహించారు. 42.2 కి.మీ ఫుల్ మారథాన్, 21.1 కి.మీ హాఫ్ మారథాన్, 10కే, 5కే, కిలోమీటర్ల విభాగాల్లో ఈ మారథాన్ కొనసాగింది. ఫుల్ మారథాన్ను ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్, హాఫ్ మారథాన్ను వైస్ అడ్మిరల్ శ్రీనివాసన్, 10కే రన్ను నగర సీపీ రవిశంకర్ ప్రారంభించారు.