తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పదవిలో అల్లం నారాయణ కొనసాగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆయన రాజీనామ చేశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ పదవిలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.