రచ్చ చేస్తే “రద్దు” చేస్తాం..

IMG 20240726 WA0025

శాసనసభలో కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేక పోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. ‘‘గతంలో కొన్ని సంప్రదాయాలు నెలకొల్పారు. గతంలో నన్ను ఏ రోజూ అసెంబ్లీలో కూర్చో నివ్వలేదు. ప్రస్తుతం నా దగ్గరకు 10 మంది భారాస ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ శాసనసభ వాయిదా పడిన అనంతరం రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘సబితా ఇంద్రారెడ్డి మోసం అనే పదానికి భట్టి విక్రమార్క స్పష్టంగా సభలో చెప్పారు. సునితా లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రచారానికి వెళ్తే నాపై రెండు కేసులు పెట్టారు. భారాసలోకి వెళ్లిన సునీతా లక్ష్మారెడ్డి నాపై ఉన్న కేసులు కూడా తీయించలేదు. నేను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించ లేదు. ఆమెను సొంత అక్కలా భావించా. నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఆమె భారాసలోకి వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ తీసుకో, నేను పనిచేస్తా అని చెప్పి టికెట్‌ రాగానే సబిత భారాసలోకి వెళ్లారు. సభలో జగదీశ్‌రెడ్డి గంటా 10 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలు మొత్తం 6 గంటలు మాట్లాడారు. సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఆమె వ్యక్తిగత ప్రస్తావన తెస్తే మిగిలినది నేను చెప్పా. కేసీఆర్‌, హరీశ్‌రావు సభకు ఎందుకు డుమ్మా కొట్టారు. సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్‌, హరీశ్‌రావు అండగా నిలవాలి. సభలో గందరగోళం చేసేందుకే కేటీఆర్‌ సభకు వస్తున్నారు. మేం సరిపోతం అంటే ఫ్లోర్‌ లీడర్‌గా కేసీఆర్‌ ఎందుకు కేటీఆర్‌ ఉండొచ్చు కదా అని రేవంత్ ప్రశ్నించారు. బాధ్యత లేని వ్యక్తి కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. అధికారం లేకపోతే ప్రజలు అవసరం లేదు అన్నట్టు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బడ్జెట్‌పై ఇంత చర్చ జరగలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా సభ నడుస్తోంది. ఒక్క రోజు 17 గంటల పాటు సభ జరిగిందని, కేంద్ర బడ్జెట్‌కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్‌ పెట్టామని, ఈ రోజు పూర్తీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *