garuda

అధిక మాసం.. గరుడ సేవ..

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో అధిక మాసం శ్రావణ పౌర్ణమి గరుడ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వేంకటేశుని వేదం పండితులు పవిత్ర మంత్రోచ్చారనలతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Read More
mha kcr c

మా “రూటే” సపరేటు..

దేశంలో రాజకీయ మార్పు కోసం భారత రాష్ట్ర సమితి పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే  విపక్షాల “ఇండియా”లతో గానీ, అధికార కూటమి “ఎన్ డీ ఏ” తో గానీ చేతులు కలిపేదే లేదన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పర్యటనకు వెళ్ళిన కెసిఆర్ వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాము ఎవరి వైపు లేమని, ఉండబోమని తెల్సిచేప్పారు. కానీ, తాము ఒంటరిగా మాత్రం లేమని …

Read More
wgl floods c

భారీగా వరద నష్టం…

రాష్ట్రంలో ఇటివల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం వరంగల్,హన్మకొండ జిల్లాల్లో పర్యటించింది. ఏడుగురు సభ్యుల ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర బృందం హైదరాబాద్ నుండి నేరుగా  హన్మకొండ కలెక్టరేట్   కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు వాటిల్లిన నష్టం పై ఏర్పాటు హన్మకొండ, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను…

Read More
ktr 22

ఇవ్వన్నీ చేస్తాం..

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా  సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది.  దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలను ఆమోదించింది. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటిఅర్ అధ్వర్యంలో పలువురు మంత్రులు విలేకర్లకు వివరించారు. రాష్ట్రంలో వదలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాల వల్ల  అనుహ్యరీతిలో వరదల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డవారికి రాష్ట్ర…

Read More
pet land

కోకాపేటలో ఓకే… మరి మా సంగతి….

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ జర్నలిస్టుల పట్ల ఎందుకు ద్వంధ వైఖరిని అవలంభిస్తోంది. లక్షల రూపాయలు ధార పోసి కొనుగోలు చేసి, కొందరు అసూయపరుల మూలంగా  పదిహేను ఏళ్లకు పైగా కోర్టులో నలిగి సాధించుకున్న భూములను జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడానికి ప్రభుత్వం నాన్చుడు ధోరణి ఎందుకు అవలంభిస్తోందో అంతుపట్టడం లేదు. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలో ఎకరం భూమిని జర్నలిస్టులకు అప్పజెప్పడానికి అంగీకరించిన మంత్రి వర్గానికి పేట్ బషీరాబాద్…

Read More
chalo raj

ఛలో రాజ్ భవన్…

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం “ఛలో రాజ్ భవన్ ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలు సమావేలో రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు లు మాట్లడుతూ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వ విద్యకు నష్టం చేసి ప్రైవేట్, కార్పోరేట్…

Read More
jawdkr etela

ఢిల్లీలో వ్యూహాలు..

తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వ్యుహాలకు కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రానికి చెందినా ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతోంది. మొన్న బండి సంజయ్ అమిత్ షా ని కలవడం, ఆతర్వాత ఆయనను పార్టీ జాతీయ కార్యదర్శిగా ప్రకటించడం, కిషన్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ చేరికపై మంతనాలు చేయడం కనిపిస్తోంది. తాజాగా బిజెపి తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఢిల్లీలోని తెలంగాణ ఎలక్షన్ ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్…

Read More
Screenshot 20230731 221120 Gallery 1

స్థలం ఎందుకు ఇవ్వరు…

ప్రభుత్వం పేట్ బషీరాబాద్ లో  కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సొసైటీ సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. ఈ నెల 10వ తేదీలోపు ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి సొసైటీ కి బదలాయించాలని, లేకపోతే హైదరాబాద్ లోని అన్ని హెచ్.ఎం.డి.ఎ. కార్యాలయాల ముందు నిరసనలకు దిగుతామని వెల్లడించింది. పేట్ బషీరాబాద్ స్థలంలో  జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది….

Read More
IMG 20230730 WA0044

దిల్‌రాజు ప్యానల్…

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది.ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందిలో దిల్‌రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు.స్టూడియో సెక్టార్ నుంచి గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌ కాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి.

Read More
Screenshot 2023 07 30 160224

రష్యాలో డ్రోన్ దాడులు..

రష్యా రాజధాని మాస్కో లో డ్రోన్ లతో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రెండు భావనలు ధ్వంసం అయ్యాయి. దాడులకు పాల్పడేందుకు ఆకాశంలో తిరుగుతున్న కొన్ని డ్రోన్ లను సైన్యం కుల్చివేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందవలసి ఉంది.

Read More
priya police

నారాయణ వదలట్లే..

ఆంధ్రప్రదేశ్ మాజీ  మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత  నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం వేధిస్తూ,  బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ పొంగూరు కృష్ణప్రియ పోలీసులను ఆశ్రయించింది. నారాయణ డేగ మాదిరిగా  వెంబడించి నానా రకాల హింసలకు గురిచేశాడని ప్రియ బహిరంగ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణ  తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తన గోడు వెల్లబుచ్చుకుంది. ఇంట్లో ఎదుర్కొంటున్న నారాయణ వేదింపులపై  వీడియో విడదుల చేసిన తరువాత నారాయణ నుంచి వేధింపులు…

Read More
Screenshot 2023 07 30 114523

ఇప్పుడు బిజెపి వైపు…

ప్రముఖ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి  రానున్నారు.  ఆమె త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే  సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని జయసుధ కలవడంతో ఈ ఉహగానలకు తెరలేచింది. ఇద్దరూ సుమారు గంటకు పైగా సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరేందుకు రెండు, మూడు  రోజుల్లో న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వీలైనంత ఎక్కువ మంది…

Read More
jnj c 2

ఈ జాగా మాదే…

దాదాపు 16 ఏళ్ల తీరని కల. 2007 లో అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూములపై కొండంత ఆశ. ఎప్పటికైనా దక్కకపోతుందా అనే గట్టి నమ్మకం. సుధీర్ఘ ఎదురుచూపులు. చివరకు హైదరాబాద్ విలేకర్లకు ఇళ్ళ స్థలాలు ఇవల్సిందే అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తమ సమస్య పరిష్కారం అయినట్టే అన్న నిట్టూర్పు. కానీ “సుప్రీం” తీర్పు ఇచ్చి ఏడాది గడుస్తున్నా అతీ గతీ లేదు. విన్నపాలు, పోరాటాలను పట్టించుకున్న నాధుడే లేడు. ప్రభుత్వం ఎవరికో మేలు…

Read More
jnj 3 2

ఎవరేంటో తేలాలి…

ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ విలేకర్లు డబ్బు చెల్లించి మరీ ఎదురుచూస్తున్న ఇళ్ళ స్థలాలకు పరిష్కారం దొరుకుతుందా.. ఎంత పోరాటం చేసినా , దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం, అధికారులు ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు…దీని వెనుక ఎవరున్నారు ….అసలు జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ ఏం చేస్తోంది… అది ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతోందా… కమిటీ నాయకులలోనే కొందరు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారా, ఒత్తిడి తేలేక పోతున్నారా …జర్నలిస్టుల సదాక బాధకాలు చూడాల్సిన మీడియా అకాడమీ కూడా…

Read More
bhadra c

టెన్షన్..టెన్షన్ …

కుండపోత వర్షాలతో వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. ఈ  చెరువు గండిపడడంతో ఆ చుట్టుపక్కల ఉన్న  పోతననగర్, సరస్వతినగర్ కు ప్రమాదం పొంచి ఉంది. సమాచారం అందుకున్న మున్సిపల్, ఎన్.డి.ఆర్.ఎఫ్. అధికారులు హుటహుటిన గండి పడ్డ ప్రాంతానికి చేరుకున్నారు. నివాస గృహాలవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నరు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి,  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా  గండి ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Read More