“నీళ్ళబాయి” దగ్గర…
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో, గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న “సర్కారు నౌకరి” చిత్రం ఆడియో విడుదల అయింది. రాఘవేంద్ర రావు అభిరుచి తగ్గట్టు చిత్రీకరించిన “నీళ్ళాబాయి ” అనే పాట ఆకట్టుకునేలా ఉంది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో, గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న “సర్కారు నౌకరి” చిత్రం ఆడియో విడుదల అయింది. రాఘవేంద్ర రావు అభిరుచి తగ్గట్టు చిత్రీకరించిన “నీళ్ళాబాయి ” అనే పాట ఆకట్టుకునేలా ఉంది.
ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో రామచిలుకలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.135 చిలుకలను ఒక డబ్బాలో కుక్కి బస్సు స్టేపిని ఉండే చోట దాచిపెట్టాడు. బస్సు నుంచి వచ్చే వేడికి కొన్ని, గాలి అందక మరికొన్ని కలిపి మొత్తం 125 చిలుకలు ప్రాణం విదిచాయి.
ఆంధ్ర ప్రదేశ్ కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో భవిష్యత్ కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నుల పై మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పై హర్షం వ్యక్తం చేశారు.
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. స్వప్న అనే మహిళ ప్రసవం కోసం పెద్దాసుపత్రికి వెళితే, ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెరను మరిచారు. బాధితరాలికి కడుపు నొప్పి రావడంతో వైద్యుల నిర్వాకం బయట పడింది. స్వప్న కు తీవ్ర కడుపు నొప్పి కలగడంతో స్కాన్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో మరోసారి ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ శశిధర్ ని ప్రశ్నించగా కడుపులో కత్తెర మరచిపోయిన విషయం నిజమేననిచెప్పారు….
విశాఖ గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్ కి పిలుపు నిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు. కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు…
భారత సైన్యం అమ్ములపొదిలో మరో సాంకేతిక నైపుణ్యం చేరింది. సమస్యాత్మక ప్రాంతాల్లో జవాన్లు గాలిలో ఎగురుతూ లక్ష్యాన్ని, గమ్యన్ని చేరుకోవడానికి వీలుగా “జెట్ ప్యాక్ సూట్” ని అందుబాటులోకి తెచ్చారు. గురువారం నాడు ఈ సూట్ ని అధికారులు ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
ఉస్మానియ యూనివర్సిటీ భూములను శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణీకేశ్వర్ నగర్ లో ఉన్న సుమారు 2 ఏకరాల స్థలంలో పద్మారావు ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఖండించారు. పద్మారావు నిజంగా బస్తీ వాసులకు హాస్పిటల్ నిర్మించాలంటే అక్కడున్న వేరే భూముల్లో కట్టివ్వాలని సూచించారు. యూనివర్సిటీ భూముల్లో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని…
ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనలో పలువురు పోలీసులు, కార్మికులకు గాయాలయ్యాయి. పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాటలో 10 మంది పోలీసులు సహా పలువురు కార్మికులు గాయపడ్డారు.
హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు మంజూరు చేయాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యం విలేకర్లు, జర్నలిస్టు సంఘాలను అసంతృప్తికి గురి చేస్తోంది. డబ్బు చెల్లించి, 16 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పాత్రికేయులకు, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం వేచిచూస్తున్న వారికీ ప్రభుత్వం న్యాయం చేస్తామనే చెబుతోంది. కానీ, ఎప్పుడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.అయితే, ఇదే విలేకర్ల వర్గానికి జిల్లాల్లో మాత్రం స్థలాలు కేటాయించడం, వారికి మంజూరు చేయడం వేగంగా జరిగి…
లిబియా రాజధాని ట్రిపోలిలో సాయుధ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో సుమారు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణకు సరైన కారణాలు ఏమిటనేది తెలియక పోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు సాయుధ వర్గాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
చంద్రుని పైకి దూసుకు పోతున్న చంద్రయాన్ -3 చంద్ర కక్ష్యలో మూడో అవరోహణ వరకు చేరుకున్నట్లు ఇస్రో తెలిపింది.chandryayan-3 ప్రస్తుతం 153 కిలోమటర్లు x 163 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతున్నట్టు వివరించింది.
మెగాస్టార్ చిరంజీవికి న్యూఢిల్లీలో మోకాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. వారం రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మిల్కీ అందాలతో “మిస్టర్ పర్ఫెక్ట్” వంటి యువత మనసుల్లో రొమాంటిక్ “దరువు” వేయించి “గేమ్ ఓవర్” అంటూ ప్రేక్షకులను “ఆనందో బ్రహ్మ” అనిపించిన తాప్సీ మొన్నీ మధ్య షాకింగ్ న్యూస్ చెప్పింది. టాలీవుడ్, కోలీవుడ్ తెరపై అనేక సినిమాలు చేశాను. కానీ బాలీవుడ్ తెరపై కనిపించాలంటే కొన్ని వదులుకోవాలేమో అని భయమేసిందని చెప్పింది. ఎందుకంటే, అక్కడి ఓ ఇద్దరు సినీ ప్రముఖులు రాత్రిళ్ళు ఫోన్లు చేసి రమ్మనే వారని బాంబు పేల్చింది. అయితే తాను అలాంటి దాన్ని…