వేడుకలో…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
భారత్ సరిహద్దు లద్దాఖ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి సమీపంలోని భేరి అనే ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందినట్టు సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యా నాథ్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లక్నోలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై దిగేందుకు చంద్రయాన్ మరో అడుగు దూరంలోనే ఉంది. ఈ క్రమంలో ఇస్రో ఆసక్తికరమైన చిత్రాలను విడుదల చేసింది. ఆగస్టు15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన తర్వాత చంద్రుడిపై ల్యాండర్ తీసిన ల్యాండింగ్ ప్రాంత వీడియోలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ జర్నలిస్టుల చిరకాల ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకరులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి లో సభ్యులకు 2007వ సంవ్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. నిజాం పేట్ ప్రాంతంలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాలు…
హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సీఎం కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులు యర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, పలువురు సినప్రముఖులు హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో అడవుల నుంచి వన్య ప్రాణులు జనారణ్యంలోకి రావడానికి నానారకాల కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని అదిలాబాద్,కరీంనగర్ జిల్లాల్లో, ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, శ్రీ శైలం తదితర జిల్లాల్లో పచ్చని చెట్ల అడవులను వదిలి కాంక్రీట్ జంగిల్ లోకి ఎందుకు వస్తున్నాయనే చర్యలు మొదలయ్యాయి. వన్య ప్రాణుల స్వభావాన్ని బట్టి చూస్తే అవి సాధారణంగా జనావాసాల మధ్యకి వచ్చే అవకాశం లేదు. తమ ఉనికికి ముప్పు వాటిల్లే బలమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే జన…
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో, గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న “సర్కారు నౌకరి” చిత్రం ఆడియో విడుదల అయింది. రాఘవేంద్ర రావు అభిరుచి తగ్గట్టు చిత్రీకరించిన “నీళ్ళాబాయి ” అనే పాట ఆకట్టుకునేలా ఉంది.
రవితేజ నటించిన “టైగర్ నాగేశ్వర రావు” ట్రెయిలర్ దుమ్ము రేపుతోంది..
ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో రామచిలుకలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.135 చిలుకలను ఒక డబ్బాలో కుక్కి బస్సు స్టేపిని ఉండే చోట దాచిపెట్టాడు. బస్సు నుంచి వచ్చే వేడికి కొన్ని, గాలి అందక మరికొన్ని కలిపి మొత్తం 125 చిలుకలు ప్రాణం విదిచాయి.
ఆంధ్ర ప్రదేశ్ కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో భవిష్యత్ కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నుల పై మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పై హర్షం వ్యక్తం చేశారు.
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. స్వప్న అనే మహిళ ప్రసవం కోసం పెద్దాసుపత్రికి వెళితే, ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెరను మరిచారు. బాధితరాలికి కడుపు నొప్పి రావడంతో వైద్యుల నిర్వాకం బయట పడింది. స్వప్న కు తీవ్ర కడుపు నొప్పి కలగడంతో స్కాన్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో మరోసారి ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ శశిధర్ ని ప్రశ్నించగా కడుపులో కత్తెర మరచిపోయిన విషయం నిజమేననిచెప్పారు….
విశాఖ గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్ కి పిలుపు నిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు. కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు…
భారత సైన్యం అమ్ములపొదిలో మరో సాంకేతిక నైపుణ్యం చేరింది. సమస్యాత్మక ప్రాంతాల్లో జవాన్లు గాలిలో ఎగురుతూ లక్ష్యాన్ని, గమ్యన్ని చేరుకోవడానికి వీలుగా “జెట్ ప్యాక్ సూట్” ని అందుబాటులోకి తెచ్చారు. గురువారం నాడు ఈ సూట్ ని అధికారులు ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
ఉస్మానియ యూనివర్సిటీ భూములను శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణీకేశ్వర్ నగర్ లో ఉన్న సుమారు 2 ఏకరాల స్థలంలో పద్మారావు ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఖండించారు. పద్మారావు నిజంగా బస్తీ వాసులకు హాస్పిటల్ నిర్మించాలంటే అక్కడున్న వేరే భూముల్లో కట్టివ్వాలని సూచించారు. యూనివర్సిటీ భూముల్లో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని…