Screenshot 2023 07 29 090004

మా బావ మహా ముదురు…

ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత , ఆ రాష్ట్ర మాజీ మంత్రి నారాయణపై అతని సొంత మరదలు తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమ్ముని భార్యని అని కూడా చూడకుండా తనపై డేగ మాదిరిగా నారాయణ కన్ను వేశాడని, నానా రకాలుగా వేధించాడని అతని మరదలు పొంగూర్ ప్రియ ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం…

Read More
bheem c

దళితుల “ప్రగతి” భేష్…

దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుండి ఆత్మ గౌరవం దిశగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉందని, ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ సందర్భమని  భీమ్ ఆర్మీ  చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. హైదరాబాద్ పర్యటన సందర్బంగా  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి…

Read More
cs shanti 1

ఇక ఆరోగ్యంపై దృష్టి…

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గు ముఖం పట్టినందున వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల తాకిడికి గురైన జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రతల పై ఆమె జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరద…

Read More
godavari in 2

కదలలేక..మెదల లేక…

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.హైదరాబాద్, విజయవాడ 65 వ నెంబర్ జాతీయ రహదారిపై  వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా కీసర టోల్ గేటు సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి అధికం కావడంతో  ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. హైద్రాబాద్ నుంచి ఏపి వెళ్ళే వాహనాలను కోదాడ,హుజూర్ నగర్,మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. కోదాడ – హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల…

Read More
exclusive 1

“కోడికత్తి” కేసు… ఎవరు దోషి…!

ఆ కేసు వెనుక ఎవరున్నారో ఎవరికీ తెలియదు. నేరం కావాలని చేశాడో, చేయించారో అనేది ఒక రహస్యం. రాజకీయం చేసే వారికి అది చాల పెద్ద కేసు. సామాన్యుని దృష్టిలో మాత్రం ఆ కేసు ఓ రాజకీయం. కేసుని శోధిస్తున్నది మాత్రం దేశ అత్యున్నత సంస్థ ఐన జాతీయ పరిశోధన సంస్థ, అదే ఎన్.ఐ.ఎ.. రాటుదేలిన నేరస్థుల నుంచి నిజాలు, వాస్తవాలు రాబట్టే అధికార యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకున్న బలమైన సంస్థ ఈ ఎన్.ఐ.ఎ…

Read More
Screenshot 20230727 203032 WhatsApp

వాగు దాటపోయి…

వరద నీటితో ప్రవహిస్తున్న వాగుని బైక్ పై దాటుతూ అదుపుతప్పి వాగులో కొట్టుకు పోయాడు ఓ వ్యక్తి. వరంగల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కన్నారం గ్రామానికి గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తి బైక్ వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి కొట్టుకుపోయాడు. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో గాలిస్తున్నారు.

Read More
IMG 20230727 WA0043

బీబీ కా ఆలం…

శనివారం జరిగే మొహరం పండుగకు సంబంధించి ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ పరిశీలించారు. పాత బస్తీ దార్ ఉల్ షిఫా లోని బీబీ కా ఆలం వద్ద ఏర్పాట్లను పరిశీలించి దట్టీ సమర్పించారు. అనంతరం శనివారం బీబీ కా ఆలం ఉరేగింపు జరిగే ప్రాంతాలలో పర్యటించారు.

Read More
Screenshot 2023 07 27 191517

చికాగో వీదుల్లో…

హైదరాబాద్ నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన ఓ యువతి నానా ఇబ్బందులు పడుతోంది. ఉన్నత విద్య కోసం వెళ్ళిందా లేక ఉద్యోగం కోసం వెళ్ళిందా అనే విషయం కచ్చితంగా తెలియకున్నా చికాగో నగరంలో ఆమె రోడ్ల పైనే జీవనం సాగిస్తోంది. ఆమె వివరాలు కూడా పూర్తిగా చెప్పలేక్పోతోంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమచారాన్ని బట్టి ఆమె నగరంలోని మౌలాలి ప్రాంతానికి చెందిన యువతిగా తెలుస్తోంది. విషయం తెలిసిన ఆమె తల్లి విదేశాంగ మంత్రి జై…

Read More
pawan 16

ఆదుకోండి…

తెలంగాణలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని జనసేన  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.   రాష్ట్రంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసిందని, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని, ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40…

Read More
amishaa

హైదరాబాద్‌ కు అమిత్ షా…

 బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకొని 8 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ…

Read More
kavit bhim c

అంబేద్కర్ పేరు పెట్టండి..

నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని, ఆ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్ కి తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్…

Read More
rain 2

జల దిగ్బంధం …

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణాలోని పలు జిల్లాలను ముద్ద చేశాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉత్తర ఆంధ్రకు ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాల మీద ఉన్న బలమైన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు బలహీనపడి దక్షిణ ఒడిశా, దీన్ని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీద విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6…

Read More
iit con

ఇలా చేద్దాం..

ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇనిస్టిట్యుట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇనిస్టిట్యుట్  టెక్నాలజీ (ఎన్ఐటి)కి చెందిన అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా  రెండురోజుల పాటు జరిగిన సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న 29 ఐఐటిలు, ఎన్ఐటిలకు చెందినా డీన్ లు పాల్గొన్నారు. ఈ  సమావేశాలను ఐఐటి హైదరాబాద్ బ్రాంచి డైరెక్టర్ బి.ఎస్.మూర్తి ప్రారంభించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సమాజ పరిస్థితులకు…

Read More
telangana loto

శుక్రవారం కూడా సెలవు..

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  ఆదేశించారు.

Read More
srisailam

నిండుతోంది..

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం జలాశయం నిండు కుండగా మారుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 816.20 చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215.807 టీఎంసీలగాను 38.1234 టిఎంసిలుగా నమోదయింది.

Read More