Screenshot 2023 07 13 091710

నమస్తే.. నా పేరు లీసా..

ఛానల్స్ లో ఇక మరింత సాంకేతిక మార్పు రావచ్చు. ప్రత్యేకంగా అందమైన యాంకర్ల కోసం వెతకడం, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి, వడపోసి ఎంపిక చేయడం లాంటి ప్రక్రియలకు భవిష్యత్తులో తెర పడవచ్చు. తడబాట్లు , బిడియం వంటి తలనొప్పులకు తావులేకుండా బుట్ట బొమ్మల్లాంటి యాంకర్లతో కార్యక్రమాలు చేయించ వచ్చు. ఎలాంటి యాంకర్లు, న్యూస్ రీడర్లు కావాలో ఉహించుకొని అలాంటి వాళ్ళను తెరపై చూపవచ్చు. అందుబాటులోకి వస్తున్నా సాంకేతిక పరిజ్ఞానం ఈ వెసులుబాటును కల్పించనుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్…

Read Full News
Screenshot 2023 07 12 220255

పోలీసు రక్షణ లోనే…

రాజస్తాన్ గ్యాంగ్ స్టార్ కుల్దిప్ జగినా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకువెళ్తుండగా భారత్ పూర్ వద్ద గల అమోలి టోల్ ప్లాజా వద్ద కుల్దిప్ ప్రత్యర్ధి ముఠాకు చెందిన వారు కాల్చి చంపినట్టు రాజస్తాన్ డిజిపి ఉమేష్ మిశ్రా చెప్పారు. సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టినట్టు తెలిపారు. పోలీసు వాహనంలోనే అంత బందోబస్తు మధ్య కుల్దిప్ ను హతమార్చడం పై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Read Full News
bindi

బొట్టు పెట్టుకుంటావా…

ఝార్ఖండ్ లోని సెయింట్ జేవియర్ స్కూలులో నుదిటి పై బొట్టుపెట్టుకొని వెళ్ళిన ఓ విద్యార్ధినిని టీచర్ చంప దెబ్బలు కొట్టడం తో అవమానభారం భరించ లేక ఆ విద్యార్ధిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు, పోలీసులు పాపను ఆసుపత్రికి తరలించారు.  

Read Full News
racha in1

కరెంటు రచ్చ..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అంటూ అధికార టిఆర్ఎస్ మండి పడుతోంది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా  రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మేపట్టింది, నాయకులూ, మంత్రుల అధ్వర్యంలో అన్ని జిల్లాలలో నిరసనలో భాగంగా రాస్తారోకోలు, దిస్తిబోమ్మలను దగ్దం చేశారు.ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో ఇతర నాయకులు జిల్లాల్లో నిరసన చేపట్టారు.మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్ర…

Read Full News
cm sc c

పుస్తకం భేష్…

ఎస్టీ జాతుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సృజనాత్మక పథకం‘చీఫ్ మినిస్టర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం (సీఎంఎస్ఇఇఐ) ద్వారా వివిధ రంగాలలో లబ్ధిదారులైన ఎస్టీ యువతీ యువకుల విజయగాథలను, సాధించిన ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ పుస్తక రూపంలో ప్రచురించింది. ఈ పుస్తకాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి…

Read Full News
himachal 12

క్షేమంగా రావాలి…

హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు డాక్టర్లు హిమాచల్ ప్రదేశ్ మనాలి లోని వరద ముంపు ప్రాంతంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బానోత్ కమల్ లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్ వరదల్లో చిక్కుక్కున్నారు. ముగ్గురు డాక్టర్ల ఫోన్స్ స్విచ్చాఫ్ అయినట్లు సమాచారం. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించింది.

Read Full News
harish nirmala

ఆ నిధులు ఇవ్వండి…

తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు మంజూరు చేయాలని  ఆర్థిక శాఖ మంత్రి హారీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీలో జరిగిన  50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం సమావేశానంతరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి తో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు.

Read Full News
hijra

ఏయ్…

మిర్యాలగూడలో హిజ్రాలు హాల్ చల్ చేశారు. అదీ ఎక్కడో కాదు సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ లోనే జరగడం విశేషం. హిజ్రాల పరస్పర ఘర్షణలు, కొట్లాటలతో స్టేషన్ ఆవరణ హోరెత్తింది.వివరాల్లోకి వెళ్తే, పట్టణంలో ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు….

Read Full News
ap

ఉల్లంఘిస్తే తప్పదు…

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ కుమార్‌కు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రవీణ్‌ కమార్‌ ప్రస్తుతం ఏపీఐఐసీ ఎండీగా ఉన్నారు. గతంలో విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. భీమునిపట్నం మండలంలోని కాపులప్పాడ గ్రామం పరిధిలో ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసి దాన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని అభియోగాలున్నాయి. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2017లో…

Read Full News

కరెంటు మంట…

తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 95 మంది 3 ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి మొత్తంగా రోజుకి 8 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్తు సంస్థలతో కమీషన్ లకు కక్కుర్తిపడి కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై…

Read Full News
gst 1

వసూళ్ళు ఎలా…

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక,వైద్య శాఖ మంత్రి టి.హారీష్ రావు.

Read Full News
Screenshot 2023 07 11 133536

నిర్లక్ష్యం…

ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న కారుని డి కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.అయితే, బస్సులో పిల్లలు లేకపోవడం గమనార్హం.

Read Full News

శుభకార్యానికి వెళ్తూ..

ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. వీరంతా కాకినాడలో జరిగే ఓ శుభకార్యంలో పాల్గొనడానికి పొదిలి నుండి వెళ్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ లో వీరంతా ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. బస్సులో మొత్తం…

Read Full News