Screenshot 2023 07 14 143645

ఈ సారి పట్టేస్తా “మామా”…

చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చింది. నిన్న 1.05 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించుకున్న చంద్రయాన్‌-3 ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన మార్క్‌ (ఎల్ వి ఎం 3)ఎం4 వాహక నౌక నింగిలోకి దూసుకుపోయింది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో శాస్త్రవేత్తలు ఈ  ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టారు. ఇస్రో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్‌-2…

Read Full News
dharna 1

పోరాటం ఆగదు…

జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్…

Read Full News
parlamant

ఆ బిల్లు లేదు..

ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 27 బిల్లు ఉభయసభల ముందుకులు రానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా,  మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి వివరించింది. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో చేర్చక పోవడం గమనార్హం.

Read Full News
run

కంగ్రాట్స్ జ్యోతి…

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో ఆంధ్రప్రదేశ్ కు  చెందిన జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించారు. ఈ పోటిలో బంగారు పతకం సాధించన తొలి భారత అథ్లెట్ గా నిలిచారు.  ఎన్నో ఆశలతో మొదటిసారి ఆసియా అథ్లెటిక్స్  బరిలో దిగిన జ్యోతి  అంతర్జాతీయ వేదిక పై అపురూప ప్రదర్శన చేసింది. 23 ఏళ్ల ఈ విశాఖ స్ప్రింటర్ ఫైనల్ పోటిలో 13.09 సెకన్ల లో సాక్ష్యాన్ని చేధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

Read Full News
bhuvneswri c

అమ్మ వారి సేవలో..

ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ఏపీ అధ్యక్షురాలుగా నియమితురలైన దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు.

Read Full News
godavari bcm

పెరుగుతున్న గోదావరి…

ఉత్తరాధిన కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా  భద్రాచలం వద్ద గోదావరి నది  నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. పై నుంచి భారీగా నీరు రావడంతో    గోదావరికి వరద ఉధృతి పెరిగింది.  దీంతో  భద్రాద్రిలో గోదావరి నీటి మట్టం 18.3 అడుగులకు చేరింది. గోదావరి నదికి వరద ఉధృతి  పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ సాయంత్రానికి వరద ప్రవాహం మరితం పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.

Read Full News
Screenshot 2023 07 14 104336

“రెడ్” సెక్యూరిటి…

దేశ వ్యాప్తంగా టమాటో ల ధరలు చుక్కలను అంటడంతో  వాటికీ విఐపి  భద్రతా కల్పించాల్సిన పరిస్థితి ఎర్పడింది. కొన్ని ప్రాంతాల్లో టమాటో రైతుల పై దాడులు జరగడం, మరోవైపు కొందరు టమాటోలను దొంగిలించడం వంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అధికారులు టమాటోలకు భద్రతకల్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల వ్యాపారులే బౌన్సర్ లను నియమించుకుంటున్నారు. ఆసియాలోనీ రెండో అతిపెద్ద టమాటో మార్కెట్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో ఉంది.  ఇక్కడకు పెద్ద ఎత్తున టమాటాలు రావడంతో  ముందు జాగ్రత్తగా ప్రభుత్వం…

Read Full News
Screenshot 2023 07 14 084311

ఎందుకలా …

తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్యే కొనుగోలు అంశం బట్టబయలు చేయడంలో కీలక పాత్ర పోషించిన తాండూర్ ఎమ్నెల్యే రోహిత్ రెడ్డికి, కేసీర్ సర్కార్ Y కేటగిరి అదనపు భద్రతను కల్పించింది‌… అయితే, తన భద్రతా సిబ్బందితో కలిసి రోహిత్ పోటో షూట్ లో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకలా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

Read Full News
kishan usa

స్వాగతం…

న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడి అంతర్జాతీయ విమానాశ్రయంలో బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కి సాదర స్వాగతం లభించింది.

Read Full News
mohanbabu

మండిపడ్డ “మంచు”…

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు షాద్ నగర్‌లో మీడియాపై కాసేపు మండి పడ్డారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే, మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. “ఆ లోగోలు లాక్కొండయ్యా” అంటూ బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా అంటూ నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన…

Read Full News
kavitha bonam

ఆస్ట్రేలియాలో…

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న బోనాల పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాల సంబరాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలలో ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. అదేవిధంగా జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకలో కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ…

Read Full News
revanth c

పాస్ పోర్ట్ బ్రోకర్ కెసిఆర్…

గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి వివరించి వారి సందేహాలను నివృత్తి చేసామని తెలిపారు. 24గంటల విద్యుత్ సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసామని,  కేటీఆర్, బీఆరెస్  మా వీడియోను ఎడిట్ చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. బీఆరెస్ చిల్లర రాజకీయ ప్రయత్నంతో…

Read Full News
drone c

రైతులకు క్రిషి 2.0 …

దేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్   డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవ రహిత వైమానిక వాహనం (యు ఏ వి )   క్రిషి 2.0  ను ఆవిష్కరించింది.  క్రిషి 2.0 డ్రోన్ 10 కిలోల పేలోడ్ సామర్థ్యంతో రూపొందించారు.  ఈ డ్రోన్  రోజుకు 30 ఎకరాల్లో  క్రిమిసంహారక, పురుగు మందులను  పిచికారీ చేస్తుంది.   నెలలో   750 నుండి 900 ఎకరాల్లో  రైతులు  తమ పంటలను కాపాడుకునేలా అవసరమైన మందులను పిచికారీ చేసే  అవకాశం ఉంది….

Read Full News
harisha c

ముమ్మరం చేయండి…

రాష్ట్రంలోని భోదనసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులకు  అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని, కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలని రాష్ట్ర  ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రొఫెసర్ నుండి అడిషనల్ డిఎంఇగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుండి 64 ఏళ్లకు…

Read Full News