pavn pc

లోపల జాగ్రత్త…

సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో,  దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమనీ,  దీనిపై రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అఅనే విషయం గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిపోయిందన్నారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని…

Read Full News
nda babu

సదా మీ సేవలో…

విజయవాడలో ఏ కనెక్షన్ లో కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని శాసన సభ పక్ష నాయకునిగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించగా పురంధరేశ్వరి, అచ్చెన్నాయుడు బలపరిచారు.అదేవిధంగా కూటమి ఎమ్మెల్యేలు దీనికి ఆమోదం తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read Full News
modi babu first day

ప్రమాణానికి …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి హాజరవుతున్నారు. మోడీ పర్యటనకు సంబంధించి కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నిరబ్ మాట్లాడుతూ రేపు కేసరపల్లి ఐ.టి. పార్కు ప్రాంగణంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 12 ఉదయం 8.20 గంటలకు మోడి ఢిల్లీ…

Read Full News
reviw c

ఇక్కడ”దోపిడీ”-అక్కడ”అరాచకం”..!

తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజంగా తెలివైన వారే అని ప్రపంచానికి చాటారు.మాటలు ముఖ్యం కాదు, చేతలు కావాలని తేల్చి చెప్పారు. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీని చిత్తుగా ఓడించారు. మొన్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపిని నామరూపాలు లేకుండా చేశారు. తెలంగాణలో “కారు”ని షెడ్డుకి పంపితే, ఆంధ్రాలో “ఫ్యాన్”గాలి సోకకుండా అదుపు చేశారు. అదే తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం. అయితే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఆంధ్రా రాష్ట్రంలో వైసిపి కుదేలు కావడానికి ఒకటే…

Read Full News
IMG 20240527 WA0031

మళ్లీ ఉక్కపోత..

నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఆంధ్ర ప్రదేశ్ లో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళా ఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడు తుందని భావించారు. కానీ, “రెమాల్” తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణ లోనూ జూన్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం…

Read Full News
ap electn

ఆంధ్రలో కేంద్ర అధికారులు…

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌, ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ వారికి స్వాగతం పలికారు. నగరంలోని నోవాటెల్ హోటల్లో 9,…

Read Full News
rahul vja

“పినపాక” కు రాహుల్..

తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకున్నారు. జైపూర్ నుండి ప్రత్యేక విమానం లో ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీకి అక్కడి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ హెలికాప్టర్ లో గన్నవరం నుండి ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలోని పినపాక బయలుదేరి వెళ్ళారు.

Read Full News
vja bus c

నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణాలు…

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.ఈ బస్సు ప్రమాదం పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సంఘటన జరగడం దురదృష్ట కరమని, 24 గంటల్లో విచారణ పూర్తిచేసి కారణం తెలుసుకుంటామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబానికి 5 లక్షల రూపాయనల చొప్పున పరిహారం, గాయపడిన వారికి ఆస్పత్రి…

Read Full News
IMG 20230906 WA0001 1

రిమాండ్…

ఆంధ్రప్రదేశ్  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎ.సి.బి. కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గంటల తరబడి జరిగిన వాదోపవాదనల్లో బాబు అరెస్టుకి సంబంధించి సి.ఐ.డి. పోలీసులు పకడ్బందీ ఆధారాలు చూపడంతో  న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ నిరాకరంచింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణంలో చంద్రబాబునాయుడు ప్రమేయం ఉందని శనివారం రాత్రి ఆయనను నంద్యాలలో క్యాంపు…

Read Full News
IMG 20230910 WA0089

నిరసన సెగలు…

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టాయి. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని నిలదీయడంతో పాటు రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టడాన్ని జగన్ రెడ్డి జీర్ణించుకోలేక కక్షసాధింపు చర్యలకు దిగారని దుయ్యబట్టారు. తన అవినీతి మరకను ఇతరులకు అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే చంద్రబాబు అక్రమ అరెస్ట్ అని నిరసించారు. తండ్రి…

Read Full News
apuwj

మీడియా కమిషన్ కావాలి…

మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగుల రక్షణకు, వారి పరిరక్షణకు తక్షణమే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.  మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రతేక చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు. ఈ సమస్యల న్నింటిపై అక్టోబర్ 2 గాంధీ జయంతిన ఢిల్లీలో  పెద్ద ఎత్తున జర్నలిస్టులతో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.  విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే  కార్యవర్గ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు….

Read Full News
ranga asha

సెంట్రల్ లో “రంగా” కూతురు…!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి కరమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీతో జతకట్టడం, ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే క్రమంలో పురదేశ్వరిని ఆ రాష్ట్ర బిజెపి శాఖకు అధ్యక్షురాలిగా చేయడం, చంద్రబాబు నాయుడు మాత్రం తన పంజాలో అధికార పార్టీని ఎండగడుతూ లోకేష్ ని రోడ్ షోలకు పంపి రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెజవాడ  రాజకీయలు కేంద్ర బిందువుగా మారుతాయి….

Read Full News