tgcpdcl

ఇక “క్యూఆర్” కోడ్..

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ జారీ చేసే విద్యుత్ బిల్లులపై “క్యూఆర్” కోడ్ ను ముద్రించనున్నారు. తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ “క్యూఆర్” కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చు. ఈ “క్యూఆర్” కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల  నుండి వినియోగదారులకు అందుబాటు లోకి రానున్నాయి. రిజర్వు బ్యాంక్ కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకున్నా,…

Read More
IMG 20240703 WA0052

“భేటీ” కోసం..

ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ప్రజా భవన్ లో భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లును తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్ ను సందర్శించారు. సజావుగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు….

Read More
IMG 20240703 WA0045

మళ్ళీ కాంగ్రెస్ లోకి…

సీనియర్ నేత, భారత రాష్ట్ర సమితి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీలో కే.కే.ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపా దాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.

Read More
batti houses c

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు “సోలార్”

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇత‌ర రాష్ట్రాల‌కు అధికారుల‌ను పంపించి అధ్య‌య‌నం చేయించి త్వ‌ర‌గా ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హౌజింగ్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేద‌ల‌కు కాంగ్రెస్‌ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డానికి ఈ ఏడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇండ్ల చొప్పున‌ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించింద‌న్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేసే ఆరు గ్యారంటీల అమ‌లులో భాగ‌మే ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణమ‌న్నారు. హైదరాబాద్ లోని డాక్ట‌ర్ బిఆర్…

Read More
jail 15

క్షమాభిక్ష..

వచ్చే ఆగస్టు 15న తెలంగాణ జైళ్ళలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదల కానున్నారు. దీనికి హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇరువురి మధ్య భేటీ సాగింది. ఈ సందర్భంగా గవర్నర్‌తో సీఎం లంచ్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ లపై చర్చ, యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఆగస్టు 15న…

Read More
power cmd

Reliability in Power Supply

In a move to ensure higher reliability in Power supply in GHMC, the Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) has adopted latest technologies to identify loose contacts/red hots in live electrical equipment and power lines caused due to weather and high load conditions. TGSPDCL has recently procured 35 state-of-the-art thermo-vision cameras, which have been…

Read More
kcr bailreg

పిటిషన్ కొట్టివేత..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కు ఈ రోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన పై విచారణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేత్రుతవంలోని ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది.

Read More
IMG 20240630 WA0051 1

Prestigious…

Telangana Chief Minister Revanth Reddy expressed his profound delight over the appointment of Challa Srinivasulu Setty as the new Chairman of the State Bank of India.The Chief Minister remarked that it is a momentous occasion that Srinivasulu, who hails from Jogulamba Gadwal district, has ascended to the prestigious position of Chairman of the SBI. On…

Read More
contnment

కంటోన్మెంట్ మున్సిపాలిటీ…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి…

Read More
pv jaiswrj

స్ఫూర్తీ దాత ..

సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు ఆర్థిక ఫలాలు అందించాలనే లక్ష్యంతో పీ వీ నర్సింహా రావు సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకుని వచ్చారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. పీవీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు లేని సమాజ నిర్మాణం కోసం పథకాలు చేపట్టాలని ఆయన సూచించారు. భారత రత్న మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ గౌరవ పి. వి. నరసింహ రావు 103 వ…

Read More
revant pv

సంస్క‌ర‌ణ‌ల‌ నర”సింహం”

సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో పి.వి. చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖ‌ల మంత్రిగా, ప్ర‌ధాన‌మంత్రిగా పి.వి. చేసిన సేవ‌లు మ‌రువరానివ‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రితో పాటు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి…

Read More
IMG 20240628 WA0047

మరొకరు…

చేవెళ్ల శాసన సభ నియోజక వర్గం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికైన కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదయ్యను పార్టీలోకి ఆహ్వానించారు.

Read More
IMG 20240626 WA0089

హోదా పెంచండి-అభివృద్ది చేయండి

తెలంగాణ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌లుగా విస్త‌రించాల‌ని జాతీయ ర‌హాదారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, నూత‌న జాతీయ ర‌హ‌దారుల ప్ర‌క‌ట‌న‌, ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారులుగా ప్ర‌క‌టించిన మార్గాల ప‌నుల ప్రారంభం త‌దిత‌ర అంశాలను…

Read More
IMG 20240626 WA0063

నిరసన…

విద్యార్థులను సస్పెండ్ చేస్తూ హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ.) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సుకూన్ ఫెస్టివల్, విద్యార్థుల సమస్య లపై ప్రశ్నించినందుకు విద్యార్థులను సస్పెండ్ చేయడం పట్ల విద్యార్థి సంఘ నేతలు మండి పడ్డారు. సుభాషిని, నికిత్, రిషికేష్, పంకజ్, అజయ్ లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ, 10 వేల రూపాయల జరిమాన విధించడాన్ని విద్యార్థులు ఖండించారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ,…

Read More
IMG 20240626 WA0059

“రియల్” కార్మికులను ఆదుకోండి..

రియల్ ఎస్టేట్ వెంచర్లల్లో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు విద్య, వైద్యం అందించాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది. నిర్మాణాలలో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు పని ప్రదేశాల్లో క్వాలిఫైడ్ డాక్టర్ తో వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. కార్మికుల పిల్లలకు నిర్మాణాల వద్ద పాఠశాలలు ఏర్పాటు చేయాలని జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ కోరారు. కార్మిక నాయకులు, పార్టీ నాయకులతో హైదారాబాద్ లోని తెలంగాణ లేబర్ కమిషనర్ కృష్ణ…

Read More