revnth polc job

వెంట్రుక కూడా పీకలేవ్..!

తెలంగాణ ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని నల్లగొండలో  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుందన్నారు. నన్ను చంపుతారా అని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందని చచ్చిన పామును ఎవరైనా చంపుతారా అని ప్రశ్నించారు. సూటిగా సవాల్ విసురుతున్నా“పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్” అంటూ కెసిఆర్ పై…

Read Full News
IMG 20240214 WA0044

రాజ్యసభకు”రేణుక”

తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లను ఎఐసిసి ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి. వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

Read Full News
parlament

మళ్ళీ”హస్త”గతమే…

తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే “మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌” అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణ లోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండి యా టుడే తెలిపింది. కేసీఆర్‌ నేతృత్వం లోని బీఆర్‌ఎస్‌ కేవలం మూడు సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకీ 3 సీట్లే వస్తాయని, మజ్లి్‌స్ కు యథా ప్రకారం ఒక్క…

Read Full News
medaram

సాంప్రదాయాలు ఉట్టిపడేలా…

గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరం లో మీడియా ప్రతినిధులతో “మీడియా ఇంటరాక్షన్ ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతర లో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాలలో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతరలో నిరంతరం పారిశుధ్య పనులు జరిగిన నాలుగువేల మంది పారిశుధ్య…

Read Full News
pasiyuddin

కాంగ్రెస్ లోకి…

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డిప్యూటీ మేయర్ బాధ్యతలు నిర్వర్తించిన భారత రాష్ట్ర సమితి నాయకులు బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్ఎల్ఎ మాగంటి గోపీనాధ్ వేదింపుల వల్లే పార్టీని వీడుతున్నట్టు బాబా కెసిఆర్ కి లేఖ రాశారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

Read Full News
patnam

మరో ఇద్దరు…

“నన్నూ, నా పార్టీని టచ్ చేసి చూడండి” అంటూ బిఆర్ఎస్ అగ్రనేత కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా అందుకు భిన్నంగా సొంత పార్టీ నుంచే ఎదురు దెబ్భ తగులుతోంది. మొన్న బిఆర్ఎస్ ఎంపి వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరి కొందరు తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధ పడుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం విశేషం. రెండు,మూడు రోజుల్లో…

Read Full News
drone cm c

హైదరాబాద్ లో “డ్రోన్ పోర్ట్”

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.ఆర్.ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్.ఆర్.ఎస్.సీ…

Read Full News
vnktsh neta

కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎం.పి..

తెలంగాణాలో ఘోర పరాజయంతో సతమవుతున్న భారత రాష్ట్ర సమితికి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి నియోజక వర్గ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Read Full News
IMG 20240205 WA0008

అధినేత్రితో…

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాతో సమావేశమయినట్టు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. అంశంపై రాష్ట్ర పార్టీ తీర్మానం…

Read Full News
IMG 20240201 WA0050

జర్నలిస్టు డైరీ…

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 సంవత్సరం డైరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమ వంతు కృషి చేయాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహ్మద్ సాదిక్ పాష, వైస్ ప్రెసిడెంట్లు…

Read Full News
nurse c

కలలు సాకారం చేస్తాం..

నిరుద్యోగుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళుగా వారికి తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కుటుంబంలో ఉద్యోగాలు నింపుకుంటూ విద్యావంతులైన నిరుద్యోగులను విస్మరించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొత్తగా ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్ (స్టాప్ నర్సు) లకు ఎల్.బి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. సంవత్సర కాలంగా వేచిసుస్తున్న అభ్యర్దులకు ఎలాగైనా న్యాయం చేయాలనే సంకల్పంతో నియమకాలను చేపట్టినట్టు,అందులో భాగంగానే నియామక పత్రాలు…

Read Full News
revant calandr

Calendar …

Telangana Chief Minister A. Revanth Reddy released the Telangana Government Calendar at Dr. B. R. Ambedkar Telangana Secretariaton Tuesday. Minister for Roads and Buildings Komati Reddy Venkat Reddy, Chief Secretary Santi Kumari, Principal Secretary Home Jitender, Commissioner Printing and Stationary Anjani Kumar were also present on this occasion.

Read Full News
bhatti ram

రాముడి పేరుతో రాజకీయాలా..

“రాముడు అంద‌రికి దేవుడే, మాకు కూడా దేవుడేన‌ని, మ‌తం పేరిట ప్ర‌జ‌ల‌ను విభ‌జించి రాముడి పేరిట రాజకీయాల‌ను చేసి ల‌బ్ధి పొందాల‌ని ప్రయత్నించే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని” తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క అన్నారు . హైద‌రబాద్‌లో మ‌తం పేరిట అల‌జ‌డి సృష్టించి ఓట్లు పొందాల‌ని చూస్తున్న కుయుక్తుల‌ను, వారి ఆట‌ల‌ను సాగ‌నివ్వ‌మ‌ని తేల్చి చెప్పారు. రాముడి పేరిట రాజకీయాలు చేయోద్దన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజక వర్గ ప‌రిధిలో వేర్వేరుగా జ‌రిగిన‌…

Read Full News
IMG 20240125 WA0040

ప్రజా పాలనే రాజ్యాంగం…

ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను,…

Read Full News