భక్తి కాదు..బలుపు…!

tpt drone

భక్తిని చాటుకోవలసిన చోట బలుపు కనిపించింది. పవిత్ర తిరుమల కొండ మలుపుల్లో ఓ జంట అధికారుల కళ్ళు గప్పి డ్రోన్ కెమెరాను చంకన వేసుకుపోయింది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. తిరుమలలో విజిలెన్స్ నిఘా వైఫల్యానికి సాక్ష్యంగా నిలిచింది. అస్సాం కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు లోని మోకాళ్ల పర్వతం వద్ద వారి వ్యక్తిగత డ్రోన్ తో చిత్రీకరిస్తుండగా ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించడంతో విషయం వెలుగు లోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *