delhi - EAGLE NEWS
kavit kejri cf

సౌత్ గు”లాబీ” ఉచ్చులో కేజ్రీవాల్ …!

ఢిల్లీ మద్యం కొనుగోళ్ల కుంభకోణానికి తెలంగాణనే ప్రధాన అడ్డాగా మారిందా ? ఆ వందల కోట్ల  గోల్ మాల్ తంతు కవిత కనుసన్నలలోనే జరిగిందా?  తెలంగాణాలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కవిత ఢిల్లీ మద్యం పాలసీలో అడుగు పెట్టిందా? నీతి, నిజాయితీ అంటూ “చీపురు కట్ట” పట్టుకొని అవినీతిని ఊడ్చి వేయాలనే సంకల్పంతో  రాజకీయాల్లోకి వచ్చిన  సివిల్ సర్వెంట్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,  కవిత అవినీతి కోఠరీ వలలో చిక్కుకున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు కవిత ముఠానే…

Read More
kavit kejri pc

సౌత్ గు”లాబీ” ఉచ్చులో కేజ్రీవాల్ …!

వందల కోట్ల కుంభకోణంతో ఢిల్లీ నుంచి తెలంగాణా వరకు కుదిపేసిన ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కవిత కోఠరీలో చిక్కుకున్నారా…? అందుకే దేశంలో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అరెస్టు అయ్యారా..? “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం .. మీ కోసం..

Read More
IMG 20240318 WA0017

కేజ్రీవాల్ అరెస్ట్…

దేశ ప్రజలు అనుకున్నట్టే అయింది. దేశ రాజధాని ఢిల్లీ పై ఆధిపత్యం కోసం పడిగాపులుగాస్తున్న కేంద్ర అధికారగణం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రవాల్ ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో దూకుడు పెంచిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఎన్నికల సమయంలో అటు తెలంగాణ నుంచి కవితని అరెస్టు చేసి, ఇప్పుడు నేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్టు చేసింది.

Read More
sanjy on brs

“పొత్తు”అంటే చెప్పుతో కొట్టండి…

బీజేపీ కార్యకర్తలారా, ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పొత్తుపై మీడియాకు పదే పదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని…

Read More
revant nitin

గడ్గరీ తో….

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధిల్లీలో భేటి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాదు…

Read More
IMG 20240216 WA0033

రైతులపై”కర్ణా”అస్త్రం..

కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్‌ రైతులపై పోలీసులు ‘సోనిక్‌ ఆయుధాల’ను ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయడం సోనిక్‌ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్‌ రేంజ్‌ అకూస్టిక్‌ డివైజ్‌(ఎల్‌ఆర్‌ఏడీ)గా పిలిచే సోనిక్‌ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాడుతున్నారు. అమెరికా సైన్యం అమ్ముల పొదిలో 2000 సంవత్సరం నుంచే సోనిక్‌ ఆయుధాలుండగా 2013లో ఢిల్లీ…

Read More
IMG 20240209 WA0038

వ్యూహం ఏంటో…

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. అనేక పెండింగ్ పనులు, రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలను చర్చించుకున్నట్టు సమచారం.

Read More
IMG 20240205 WA0008

అధినేత్రితో…

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాతో సమావేశమయినట్టు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. అంశంపై రాష్ట్ర పార్టీ తీర్మానం…

Read More
shrmil rahul

రాహుల్ ప్రధాని కావాలి…

రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల చెప్పారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని, ఆయన…

Read More
revanth bhti.pc

“ప్రజాపాలన”కు సాయపడండి…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్ర  ప్రయోజనాలను కాపాడడం కోసం మొట్ట మొదటిసారిగా దేశ ప్రధాని మోడీని ముఖ్యమంత్రి  హోదాలో మర్యాకలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి కోరి తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని  వీటికి సంబంధించి విభజన చట్టంలో పేర్కొన్న హక్కులను సాధించడంలో పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి…

Read More
revnth modi 1

మోడీతో రేవంత్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి మోడిని కలిశారు. రాష్ట్రానికి సంబధించిన అనెక్ అంశాలపై చర్చించారు. అయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.

Read More
IMG 20231223 WA0025

ముగిసిన విడిది…

రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది ముగిసింది. ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రప‌తి, ప‌లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం ఉద‌యం హ‌కీంపేట్‌లో రాష్ట్రపతికి గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు ప‌లికారు. ఆమె ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు.

Read More
babu delhi c 1

డిల్లీలో “బాబు”…..!

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆయనకు డిల్లీ విమానాశ్రయంలో టిడిపి నేతలు కనకమేడల రవీంద్రకుమార్,కేశినేని నాని,రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్ళారు.

Read More