రేవంత్ – బాలయ్య..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నటులు నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ నివాసానికి వెళ్ళి పుష్పగుచ్చం అందజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నటులు నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ నివాసానికి వెళ్ళి పుష్పగుచ్చం అందజేశారు.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేసవి సెలవు దినాలలో ఆడుకోవడానికి, సేద తిరడానికి సాయం కాల సమయంలో గేమ్ జోన్ లోకి ఉల్లాసంగా వెళ్ళిన చిన్నారులు, వారి తల్లి దండ్రులు అగ్ని కీలలలో బూడిదగా మారారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి నడుపుతున్న రాజ్కోట్ లోని టి. ఆర్. పి. గేమింగ్ జోన్ శనివారం “డెత్ జోన్” గా మారింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో 35 మంది వరకు సజీవ దహనం అయ్యారు. అనేక…
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మనవడి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వసంత సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో…
నాలుగు వందల స్థానాలు గెలుస్తామని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధినేతల మాటల్లో అవేశం కనిపించడం ఆశ్చర్య పరుస్తోంది. దేశంలో మూడో దశ పోలింగ్ పూర్తీ అయిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆధిత్యనాథ్ లాంటి భాజాపా నేతల ప్రసంగాల్లో ఉహించని మార్పు కనిపిస్తోంది. ఈ నేతలు “ఇండియా కూటమి” పైనా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద విసురుతున్న ఘాటైన విమర్శనాస్త్రాలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి….
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్- అబ్దొల్లహియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న వారంతా మృతి చెందారు. ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదా ఫరీన్ అనే రెండు డ్యామ్ లను ఇబ్రహీం రైసీ ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి బయలు దేరారు. అప్పుడే హెలికాప్టర్ ప్రమాదానికి…
ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం, పార్టీ బలం చూసుకొని షా అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు,…
రాష్ర్టంలో కుల గణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. జూన్ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామన్నారని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే పచ్పి మోసగాడుగా రేవంత్ ను ప్రజలు భావిస్తారని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాసాని పేర్కొన్నారు. కుల గణన చేపట్టి, కులాల…
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిష్టాత్మకమైన చేవెళ్ల పా నియోజకవర్గ పరిధిలో జై స్వరాజ్ పార్టీ అభ్యర్థి సుగురు శ్రీనివాస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన వారం రోజులుగా పార్టీ కార్యకర్తలతో ప్రచార రథం పై గ్రామ గ్రామం తిరుగుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. జై స్వరాజ్ పార్టీ ఆశయాలను, లక్ష్యాన్ని ప్రజలకు వువరిస్తున్నారు. పెన్ను గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.
దేశంలో మూడో సారి గద్దెనెక్కాలని ఆరాట పడుతున్న కమల దళానికి అమ్ముల పొదిలో బలమైన ప్రచార అస్త్రం కొరవడినట్టు కనిపిస్తోంది. మూడు దశాబ్దాలుగా “బాబ్రీ మసీదు – రామజన్మ భూమి” గళం ఎత్తుకొని అంచెలంచెలుగా ఎదిగిన భారతీయ జనతా పార్టీకి ఈ లోక్ సభ ఎన్నికల్లో “నమో” జపం తప్ప మరో నినాదం లేకుండా పోయింది. రామాలయాన్ని నిర్మించి తీరుతామన్న వాజపేయి, అద్వానీ, మోడీ వంటి నేతలు 1992 నుంచి చేస్తున్న హామీలకు మొన్న అయోధ్యలో ముగిసిన…
ఉద్యమ పార్టీ పేరుతో దశాబ్ద కాలం తెలంగాణ పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి రాష్ర్టంలో రహదారుల అభివృద్ధికి సమాంతరంగా గుట్టు చప్పుడు కాని “దొడ్డి దారులు” కూడా బార్లా తెరిచింది. కవిత నాయకత్వంలో తెలంగాణా నుంచి ఢిల్లీ వరకు ఏకంగా “మద్యం” జాతీయ రహదారిని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో అక్రమ వసూళ్ల కోసం కొందరు అవినీతి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎంచుకొని పోలీసులతోనే “దొంగల ముఠా”ను తయారు చేసింది. ఈ ముఠా కోసం…
అంధ్రప్రదేశ్ ఎన్నికల చదరంగంలో రాజకీయ వ్యవహారాలతో పాటు కుటుంబ తగాదాలు, కక్షలు భగ్గుమంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రస్తుత పరిస్థితి కనిపించ లేదు. ఏ ఎన్నికల్లో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ జనాన్ని ఓట్లు అడిగే వారు. కానీ, ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారం మొత్తం కుటుంబాల పరువు, మర్యాదలను వీధులకు ఈడ్చుకునే రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్,…
అంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించి, వివాదంగా మారిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య ఉదంతం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. అనేక పరిణామాలు, అనుమానాల మధ్య కేంద్ర నేర పరిశోధన సంస్థ (సిబిఐ) చేతికి వెళ్లిన ఈ సంఘటన విచారణ తీరు పై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబిఐ ప్రతిష్ట పై మచ్చ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పక్కా పథకం…
ప్రజల సమ్మతి, వారి ఆకాంక్షల మధ్య అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయడం నిజంగా రాజ ద్రోహం కిందికే వస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతలు చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు తెలంగాణ ప్రజలను విస్తుపరుస్తున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరతారని, ఇప్పటికీ 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో బేరసారాలు…
సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన ఆమె వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండిన హైదరాబాద్ ను హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబునాయుడు అని, ఎల్లప్పుడూ…
దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి సీటును జై స్వరాజ్ పార్టీ ఒక ఆటోడ్రైవర్ కి కేటాయించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వాహన చట్టంలోని కఠిన తరమైన నిబంధనలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని డ్రైవర్లు పార్టీ దృష్టికి తెచ్చారని, వాటికి వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా సామాన్య డ్రైవర్లకు తాము అండగా ఉండాలనే ఆలోచనతో నగరంలోని ఒక ఆటో డ్రైవర్ కు సీటు కేటాయించామని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు…