IMG 20240310 WA0011

మిస్ వరల్డ్ “చెక్”…

ఈ సారి ప్రపంచ సుందరి-2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి కైవసం చేసుకుంది. ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా ఈ కిరీటాన్ని అందుకున్నారు. ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన  వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో కిరీటం…

Read Full News
IMG 20240308 WA0058

పాత బస్తీకి మెట్రో….

హైదరాబాద్ పాత బస్తీకి మెట్రో రైల్ పరుగు పెట్టనుంది. అఫ్జల్ గంజ్ ఎంబీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 2వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెట్రో పనులు చేపడుతున్నారు. దీంతో పాత నగరం ప్రజలకు మెట్రో అందుబాటులోకి రానుంది. శంకుస్థాపన కార్యక్రమంలో ఎం.ఐ.ఎం. నేత, ఎం.పీ అససుద్దిన్ ఓవైసీ సహా పలువురు పాల్గొన్నారు.

Read Full News
brslrs cf

భారాస శాపమే ఎల్.ఆర్.ఎస్.

భారత రాష్ట్ర సమితి (భారాస) నేతలు ఇంకా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని మరచిపోయినట్టు లేరు. తెలంగాణా ఏర్పడి పదేళ్ళయినా, అప్పటి నుంచి మొన్నటి వరకు అధికారం చెలాయించిన విషయాన్ని విస్మరించి ఇంకా ఉద్యమ సమయంలోని ఆలోచనలతో ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశబ్ధం కిందటే  ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందని, ఆ  రాష్ట్రంలో ఉంటున్నామనే విషయం తెలిసి కూడా అప్పట్లో రాజశేర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో తెలంగాణా కోసం వ్యవహరించినట్టు ఇప్పటి బి.అర్.ఎస్. నేతలు…

Read Full News
brslrs p 1

అంతే దేన్నైనా వ్యతిరేకిస్తామ్….!

తెలంగాణా రాష్ట్రంలో అధికార పక్షం పై కొద్ది రోజులుగా విపక్షం చేస్తున్న దాడి వెనుక వాస్తవాలు ఏమిటి? “ఈగల్ న్యూస్” ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం… మీ కోసం..త్వరలో…

Read Full News
bahujan c

“దొర” గడీలోకి బహుజనులు…!

రాజకీయ ప్రత్యర్ధులు, రాజకీయ శత్రువులను గడీ దరిదాపుల్లోకి కూడా రానివ్వని గులాబీ దళపతి ఎత్తుగడల్లో మార్పునకు కారణం ఏమిటి? మొన్నటి ఎన్నికల వరకు ఒంటెత్తులతో తిరుగులేని అధికారం చెలాయించిన కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకున్నారు? ఎన్నికల ఫలితాల తర్వాత ఫాం హౌస్ లో ఏలాంటి వ్యూహా రచనలు జరిగాయి? శాసన సభ ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూసిన భారత రాష్ట్ర సమితి మనుగడ కోసం కేసీఆర్ మెట్లు దిగక తప్పడం లేదా? మొన్నటి వరకు…

Read Full News
IMG 20240304 WA0026

ఆర్ ఆర్ ఆర్….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు…

Read Full News
ali

నంద్యాల నుంచి”అలీ”..?

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నలోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాజాగా నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో నంద్యాల స్థానాన్ని హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్ కు ఇచ్చే సూచనలు ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్, అమలాపురంలో ఎలీజా, విజయనగరానికి సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ పేర్లు ఖరారైనట్టు సమాచారం.

Read Full News
drug lishi

సస్పెన్స్….

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి ఎక్కడున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. కేసు వెలుగు చూసిన నాటి నుంచి ఈ నటి తెరవెనక్కి వెళ్ళిపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక, లిషి కనిపించడం లేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతుపట్టకుండా ఉంది.

Read Full News
rathd sitaka c

“సేవ” కోసం ఆరాటం…

తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో ఉన్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికారం  కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడం, బారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్, బిజెపి వైపు అడుగులు వేయడంతో వివిధ జిల్లాల్లో ఆశావాహుల సంఖ్య అధికామవుతోంది. కాంగ్రెస్, భారాస, బిజెపిలలోని సీనియర్ నేతలు, గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి ఆయా పార్టీల అధినేతల బుజ్జగింపులు, హామీలతో వెనక్కి తగ్గిన నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో…

Read Full News
krish

కనిపించని “కంచె”…!

హైదరాబాద్ రాడిసన్ హోటల్ లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీ కేసులో నిందితునిగా ఉన్న సినీ దర్శకులు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ డైరెక్టర్ కి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు కోర్టుకు సమాచారం ఇచ్చారు.ఆయన కోసం గలిస్తున్నట్టు పేర్కొన్నారు. క్రిష్ పలువురు అగ్ర నటులతో హిట్ సినిమాలు చేశారు. గమ్యం, వేదం, మాణీకర్ణిక, గౌతమి…

Read Full News
mega dsc

మెగా”డీఎస్సీ”…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను గుర్తించి దశల వారీగా భర్తీ చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్ జారీ చేశారు.

Read Full News