ఆర్ ఆర్ ఆర్….
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు…
నంద్యాల నుంచి”అలీ”..?
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నలోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాజాగా నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో నంద్యాల స్థానాన్ని హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్ కు ఇచ్చే సూచనలు ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్, అమలాపురంలో ఎలీజా, విజయనగరానికి సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ పేర్లు ఖరారైనట్టు సమాచారం.
సస్పెన్స్….
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి ఎక్కడున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. కేసు వెలుగు చూసిన నాటి నుంచి ఈ నటి తెరవెనక్కి వెళ్ళిపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక, లిషి కనిపించడం లేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతుపట్టకుండా ఉంది.
“సేవ” కోసం ఆరాటం…
తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో ఉన్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడం, బారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్, బిజెపి వైపు అడుగులు వేయడంతో వివిధ జిల్లాల్లో ఆశావాహుల సంఖ్య అధికామవుతోంది. కాంగ్రెస్, భారాస, బిజెపిలలోని సీనియర్ నేతలు, గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి ఆయా పార్టీల అధినేతల బుజ్జగింపులు, హామీలతో వెనక్కి తగ్గిన నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో…
కనిపించని “కంచె”…!
హైదరాబాద్ రాడిసన్ హోటల్ లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీ కేసులో నిందితునిగా ఉన్న సినీ దర్శకులు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ డైరెక్టర్ కి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు కోర్టుకు సమాచారం ఇచ్చారు.ఆయన కోసం గలిస్తున్నట్టు పేర్కొన్నారు. క్రిష్ పలువురు అగ్ర నటులతో హిట్ సినిమాలు చేశారు. గమ్యం, వేదం, మాణీకర్ణిక, గౌతమి…
మెగా”డీఎస్సీ”…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను గుర్తించి దశల వారీగా భర్తీ చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్ జారీ చేశారు.
నా నాలుగో పెళ్ళాం “జగన్”…
ప్రజా సమస్యల పై పోరాడాల్సిన రాజకీయ పార్టీ నేతలు వ్యక్తిగత వ్యవహారాలను తెరపైకి తీసుకురావడం వింతగా కనిపిస్తోంది. అదీ ఏదో చిన్నా చితకా సరదా వ్యాఖ్యలు కాదు.. ఏకంగా పెళ్ళిళ్ళు, పెళ్ళాల వరకు వెళ్ళడం రాజకీయ పరిపక్వత లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. సరిగ్గా ఇదే తంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార పార్టీ వైసీపీకి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెలా ఉంది. ముఖ్యమంత్రి జగన్…
“టోల్”టెండర్ల పై విచారణ…
హైదరాబాద్ చుట్టూ నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది. ఏయే సంస్థలున్నాయి, ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి…
తెలంగాణ భాష మహా మాధుర్యం..
“తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ భాష” అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడు తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. రవీంద్ర భారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అంద జేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని…
Great movement…
It was a very special moment for me to hand over wings to the four Indian astronaut-designates. They reflect the hopes, aspirations and optimism of 140 crore Indians said prime minister Narendra modi. India is proud of Group Captain Prasanth Balakrishnan Nair, Group Captain Ajit Krishnan, Group Captain Angad Pratap and Wing Commander Shubhanshu Shukla.
“ఆరు”అమలు ఖాయం…
ప్రభుత్వాన్నికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. ‘‘కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి…
