రేవంత్ తో…
సినీ నిర్మాత అచ్చిరెడ్డి, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
సినీ నిర్మాత అచ్చిరెడ్డి, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఢిల్లీ మద్యం కొనుగోళ్ల కుంభకోణానికి తెలంగాణనే ప్రధాన అడ్డాగా మారిందా ? ఆ వందల కోట్ల గోల్ మాల్ తంతు కవిత కనుసన్నలలోనే జరిగిందా? తెలంగాణాలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కవిత ఢిల్లీ మద్యం పాలసీలో అడుగు పెట్టిందా? నీతి, నిజాయితీ అంటూ “చీపురు కట్ట” పట్టుకొని అవినీతిని ఊడ్చి వేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన సివిల్ సర్వెంట్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కవిత అవినీతి కోఠరీ వలలో చిక్కుకున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు కవిత ముఠానే…
వందల కోట్ల కుంభకోణంతో ఢిల్లీ నుంచి తెలంగాణా వరకు కుదిపేసిన ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కవిత కోఠరీలో చిక్కుకున్నారా…? అందుకే దేశంలో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అరెస్టు అయ్యారా..? “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం .. మీ కోసం..
ఇంకా కష్టమే “సార్”… ఇంజన్ బాగా “బోర్” కొచ్చి నడిచేలా లేదు.. కొన్ని “పార్టులు” కూడా కనిపించడం లేదు…
దేశ ప్రజలు అనుకున్నట్టే అయింది. దేశ రాజధాని ఢిల్లీ పై ఆధిపత్యం కోసం పడిగాపులుగాస్తున్న కేంద్ర అధికారగణం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రవాల్ ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో దూకుడు పెంచిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఎన్నికల సమయంలో అటు తెలంగాణ నుంచి కవితని అరెస్టు చేసి, ఇప్పుడు నేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్టు చేసింది.
తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు కళ్ళాలు లేని గుర్రంలా పరుగులు తీసిన భారత రాష్ట్ర సమితి ఆ ఎన్నికల ఫలితాల అనంతరం సావడికే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతులేని ఆలోచనలతో రంకెలేసిన భారాస అధినేత, ఆయన అనుచరగణం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ళ తిరుగులేని పాలనలో జరిగిన అవినీతి,అక్రమ వ్యవహారాలు ఒక్కసారిగా గుప్పుమనడం భారాస మనుగడకు తలనిప్పిగా మారడం ఒక సమస్య అయితే, ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత…
భారత రాష్ట్ర సమితి జాతీయ ఎజెండా ఏమైంది? ఓటమి తర్వాత బిగుస్తున్న ఉచ్చులు పార్టీ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇలాంటి అనేక అంశాల పై “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం.. మీ కోసం…త్వరలో…
కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ బాబాను, ఆయన యాజమాన్యం లోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.ఆరోగ్య రక్షణకు సంబంధించి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి.వీటిపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఇకపై…
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్ రీచ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకి తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు కోల్కతా మేయర్ ఫిర్హద్ హకీమ్ తెలిపారు. ఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ప్రమోటర్ను అరెస్టు చేసినట్లు మేయర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలానికి వెళ్లి…
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో 88 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఏక పక్షంగా జరిగిన ఎన్నికల్లో ముగ్గురు ప్రత్యర్థులు ఆయనకు నామమాత్రపు పోటీనే ఇచ్చారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంతో పుతిన్కు ఎదురు లేకుండా పోయింది. తాజా విజయంతో మరో ఆరేళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
పాకిస్థాన్ నేవీలో మొట్ట మొదటిసారిగా ఒక నిఘా నౌక చేరింది. అణు వార్ హెడ్లు ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా పసిగట్టే సామర్థ్యం గల ఈ నౌకను చైనా నుంచి సమకూర్చుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెలవించుకున్న ఈ నౌక ఇతర కీలక సమాచారాన్నీ సేకరించ గలదు. 87 మీటర్ల పొడవున్న ఈ నౌకకు పీఎన్ఎస్ రిజ్వాన్ అని పేరు పెట్టారు. ఈ షిప్లో రాడార్లు ఇతర ట్రాకింగ్ వ్యవస్థలు కలిగిన మూడు డోములున్నాయి. అయితే, ప్రస్తుతం…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు.
ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఎన్ని హామీలైనా గుప్పించవచ్చు. ప్రత్యర్థి పార్టీ పై రాజకీయ విమర్శలూ చేయొచ్చు. కొన్నేళ్ల కిందట వరకు ఎన్నికల తెరపై ఇదే తంతు కనిపించేది. రానురానూ అది కాస్తా వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళింది. దశాబ్ద కాలంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజా సమస్యల ముచ్చట పక్కనపెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సర్వ సాధారణమైంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీనీ, దాని నాయకులను ఓడిన నేతలు శత్రువులుగా చూడడం పరిపాటైంది. అధికార…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన…
తనైరా కంపెనీతో పాటు బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ కంపెనీ జేజే యాక్టివ్ ఆదివారం నిర్వహించిన ‘శారీ రన్’ కార్యక్రమం విజయవంతం అయింది. పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. దాదాపు 3 వేల మందికి పైగా మహిళలు చీరకట్టులో పరుగులు పెట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సంప్రదాయ చీరకట్టుతో మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు….