IMG 20240312 WA0051

సన్మానం…

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణాలోని 31జిల్లాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఘనంగా సత్కరించారు. హైదారాబాద్ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ సన్మానం జరిగింది.

Read More
IMG 20240312 WA0020

మళ్ళీ”నమో”…

తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోడీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమనిపిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోడీని మూడో సారి ప్రధానిగా చేద్దామా..? 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామా..? అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.”ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నామ స్మరణే వినిపిస్తోందన్నారు. మజ్లీస్‌…

Read More
IMG 20240312 WA0037

హైతీ ప్రధాని రాజీనామా

కరేబియన్ దేశం హైతీ సాయుధ గ్రూపుల దాడులతో అట్టుడుకుతోంది. ప్రధాని యేరియల్ హెన్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ముఠాలు విరుచుకు పడుతున్నాయి. దీంతో గత్యంతరం లేక ప్రధాని హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు కరీబియన్ కమ్యూనిటీ ఛైర్మన్ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు.

Read More
IMG 20240311 WA0010

త్వరలో నర్సింగ్ డైరెక్టర్…

రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరెట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. సికింద్రాబాద్ న్యూ బోయగూడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1కోటి 50 లక్షల రూపాయలతో ఆధునికరించిన భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ మిడ్ వైఫరీ శిక్షణ సంస్ధను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్సింగ్ విద్యలో మిడ్ వైఫరీలో శిక్షణ తీసుకున్న వారు 83% ప్రసూతి…

Read More
IMG 20240311 WA0001

భాజపా లోకి…

తెలంగాణలో భారాసకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురు సీనియర్‌ నేతలు భాజపా గూటికి చేరారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌ నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైది రెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో తరుణ్‌ చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
IMG 20240310 WA0204

రంజాన్ దీక్షలు…

దేశంలో 12వ తేదీ నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. నెలవంక దర్శనం ఇవ్వడంతో సౌదీ అరేబియాలో 11 నుంచి దీక్షలు మొదలవుతున్నాయి.

Read More
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read More
IMG 20240310 WA0011

మిస్ వరల్డ్ “చెక్”…

ఈ సారి ప్రపంచ సుందరి-2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి కైవసం చేసుకుంది. ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా ఈ కిరీటాన్ని అందుకున్నారు. ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన  వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో కిరీటం…

Read More
IMG 20240308 WA0058

పాత బస్తీకి మెట్రో….

హైదరాబాద్ పాత బస్తీకి మెట్రో రైల్ పరుగు పెట్టనుంది. అఫ్జల్ గంజ్ ఎంబీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 2వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెట్రో పనులు చేపడుతున్నారు. దీంతో పాత నగరం ప్రజలకు మెట్రో అందుబాటులోకి రానుంది. శంకుస్థాపన కార్యక్రమంలో ఎం.ఐ.ఎం. నేత, ఎం.పీ అససుద్దిన్ ఓవైసీ సహా పలువురు పాల్గొన్నారు.

Read More
brslrs cf

భారాస శాపమే ఎల్.ఆర్.ఎస్.

భారత రాష్ట్ర సమితి (భారాస) నేతలు ఇంకా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని మరచిపోయినట్టు లేరు. తెలంగాణా ఏర్పడి పదేళ్ళయినా, అప్పటి నుంచి మొన్నటి వరకు అధికారం చెలాయించిన విషయాన్ని విస్మరించి ఇంకా ఉద్యమ సమయంలోని ఆలోచనలతో ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశబ్ధం కిందటే  ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందని, ఆ  రాష్ట్రంలో ఉంటున్నామనే విషయం తెలిసి కూడా అప్పట్లో రాజశేర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో తెలంగాణా కోసం వ్యవహరించినట్టు ఇప్పటి బి.అర్.ఎస్. నేతలు…

Read More
brslrs p 1

అంతే దేన్నైనా వ్యతిరేకిస్తామ్….!

తెలంగాణా రాష్ట్రంలో అధికార పక్షం పై కొద్ది రోజులుగా విపక్షం చేస్తున్న దాడి వెనుక వాస్తవాలు ఏమిటి? “ఈగల్ న్యూస్” ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం… మీ కోసం..త్వరలో…

Read More
bahujan c

“దొర” గడీలోకి బహుజనులు…!

రాజకీయ ప్రత్యర్ధులు, రాజకీయ శత్రువులను గడీ దరిదాపుల్లోకి కూడా రానివ్వని గులాబీ దళపతి ఎత్తుగడల్లో మార్పునకు కారణం ఏమిటి? మొన్నటి ఎన్నికల వరకు ఒంటెత్తులతో తిరుగులేని అధికారం చెలాయించిన కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకున్నారు? ఎన్నికల ఫలితాల తర్వాత ఫాం హౌస్ లో ఏలాంటి వ్యూహా రచనలు జరిగాయి? శాసన సభ ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూసిన భారత రాష్ట్ర సమితి మనుగడ కోసం కేసీఆర్ మెట్లు దిగక తప్పడం లేదా? మొన్నటి వరకు…

Read More